Pervez Musharraf: రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న ముషారఫ్.. కాంగ్రెస్పై బీజేపీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musharraf wanted to see Rahul Gandhi as PM: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. గతంలో పర్వేజ్ ముషారఫ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ హస్తం పార్టీపై విరుచుకుపడుతోంది. ఆదివారం తన సంతాప సందేశంలో ముషారఫ్ ను ప్రశంసించాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ బాలాకోట్ దాడులను అనుమానించిందని.. సొంత ఆర్మీ చీఫ్ ను గుండాగా అభివర్ణించిదని, కానీ భారత శతృవు ముషారఫ్ ను మాత్రం అభినందిస్తున్నారంటూ, ఒకప్పుడు ముషారఫ్, రాహుల్ గాంధీని పెద్ద మనిషి అని కొనియాడారంటూ ట్వీట్ చేశారు. ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్లను ప్రశంసించిన ముషారఫ్ రాహుల్ గాంధీని కూడా ప్రశంసించారు. రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. కార్గిల్ యుద్ధానికి కారకుడిని కాంగ్రెస్ ప్రశంసించడానికి ఇదే కారణం అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు షెహజాద్ ట్వీట్ చేశాడు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: CM KCR : బీఆర్ఎస్ అధికారంలో వస్తే.. దేశమంతా దళితబంధు
శశిథరూర్ తన ట్వీట్ లో.. ముషారఫ్ ఒకప్పుడు భారత్ కు శతృవు అని, అయితే అతను 2002, 2007 మధ్య ఆంతికి నిజమైన శక్తిగా మారాడని, ఆ రోజుల్లో యూఎన్లో నేను అతడిని ప్రతీ ఏడాది కలుసుకున్నానని పేర్కొన్నాడు. గతంలో ఓ ఇంటర్య్వూలో రాహుల్ గాంధీని ముషారఫ్ ప్రశంసించిన విషయాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది. 2019 లోక్ సభ ఎన్నికల ముందు ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు, మోదీ శాంతి కోసం పనిచేసే మనిషి కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
రాహుల్ గాంధీ గురించి ప్రశ్నించగా.. ముషారఫ్, తన తల్లి, అన్నయ్య, కొడుకు ఢిల్లీ వెళ్లినప్పుడు రాహుల్ గాంధీ తన కొడుకును టీ కోసం ఆహ్మానించారని చెప్పారు. మన్మోహన్ సింగ్ తమ ముగ్గురిని భోజనానికి ఆహ్వానించినట్లు తెలిపారు. భారత్ తో క్రికెట్ మ్యాచ్ ను ప్రోత్సహించే వాడినని ముషారఫ్ అన్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!