Uddhav Thackeray: ప్రజాస్వామ్యం హత్యకు గురైంది.. పార్టీ, గుర్తును కోల్పోవడంపై ఉద్ధవ్
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. శివసేన పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం విల్లు-బాణం గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి, శివసేన మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తాకినట్లు అయింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండేను ‘ మారలేని ద్రోహి’గా అభివర్ణించాడు. వారు శివసేన చిహ్నాన్ని దొంగలించారని.. మేము పోరాడుతూనే ఉంటామని.. ఆశల్ని కోల్పోమని.. ప్రస్తుతానికి దొంగతంపై షిండే సంతోషంగా ఉండనివ్వండి అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.
Read Also: Shiv Sena: శివసేన పేరు, పార్టీ గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానివే.. స్పష్టం చేసిన ఈసీ
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ఎన్నికల సంఘం నిర్ణయం ‘ప్రజాస్వామ్య హత్య’గా అభివర్ణించారు ఠాక్రే. అసలు విల్లు బాణం గుర్తు తమ వద్ద ఉన్నాయని.. షిండే వర్గం కేవలం వాటిని కాగితాల్లో మాత్రమే కలిగి ఉన్నారంటూ ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఇప్పుడు ప్రధాని ఎర్రకోట నుండి ప్రకటించాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును కోరామని.. ఇంకా తీర్పు రాకముందే, ఎన్నికల సంఘం పార్టీ పేరు, గుర్తును షిండే వర్గానికి కేటాయిండచారని.. ఇది అన్యాయం అని అన్నారు. మహారాష్ట్రలో మోదీ పేరు పనిచేయదనే, అక్రమంగా బాలాసాహెబ్ ఠాక్రే పేరు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని.. వేచి ఉండాల్సిందిగా తాను ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించానని.. భవిష్యత్తులో ఎవరైనా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు కావచ్చు అంటూ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిజమైన శివసేనగా గుర్తించి ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సత్యం, ప్రజల గెలుపుగా అభివర్ణించారు ముఖ్యమంతి ఏక్ నాథ్ షిండే. ప్రజాస్వామ్యంలో అంకెలు ముఖ్యమని అవి తమకు ఉన్నాయని.. ఇది బాలాసాహెబ్ ఠాక్రే ఆశ్వీర్వాదం అని అన్నారు. ఎన్నికల సంఘం, బీజేపీకి మద్దతుగా నిలుస్తోందని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు ఈసీ నిర్ణయం వెలువడగానే ట్విట్టర్ లో ఏక్ నాథ్ షిండే విల్లు-బాణం గుర్తును అప్డేట్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!