Uddhav Thackeray: ప్రజాస్వామ్యం హత్యకు గురైంది.. పార్టీ, గుర్తును కోల్పోవడంపై ఉద్ధవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. శివసేన పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం విల్లు-బాణం గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి, శివసేన మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తాకినట్లు అయింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండేను ‘ మారలేని ద్రోహి’గా అభివర్ణించాడు. వారు శివసేన చిహ్నాన్ని దొంగలించారని.. మేము పోరాడుతూనే ఉంటామని.. ఆశల్ని కోల్పోమని.. ప్రస్తుతానికి దొంగతంపై షిండే సంతోషంగా ఉండనివ్వండి అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.
Read Also: Shiv Sena: శివసేన పేరు, పార్టీ గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానివే.. స్పష్టం చేసిన ఈసీ
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
ఎన్నికల సంఘం నిర్ణయం ‘ప్రజాస్వామ్య హత్య’గా అభివర్ణించారు ఠాక్రే. అసలు విల్లు బాణం గుర్తు తమ వద్ద ఉన్నాయని.. షిండే వర్గం కేవలం వాటిని కాగితాల్లో మాత్రమే కలిగి ఉన్నారంటూ ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఇప్పుడు ప్రధాని ఎర్రకోట నుండి ప్రకటించాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును కోరామని.. ఇంకా తీర్పు రాకముందే, ఎన్నికల సంఘం పార్టీ పేరు, గుర్తును షిండే వర్గానికి కేటాయిండచారని.. ఇది అన్యాయం అని అన్నారు. మహారాష్ట్రలో మోదీ పేరు పనిచేయదనే, అక్రమంగా బాలాసాహెబ్ ఠాక్రే పేరు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని.. వేచి ఉండాల్సిందిగా తాను ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించానని.. భవిష్యత్తులో ఎవరైనా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు కావచ్చు అంటూ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. తమను నిజమైన శివసేనగా గుర్తించి ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సత్యం, ప్రజల గెలుపుగా అభివర్ణించారు ముఖ్యమంతి ఏక్ నాథ్ షిండే. ప్రజాస్వామ్యంలో అంకెలు ముఖ్యమని అవి తమకు ఉన్నాయని.. ఇది బాలాసాహెబ్ ఠాక్రే ఆశ్వీర్వాదం అని అన్నారు. ఎన్నికల సంఘం, బీజేపీకి మద్దతుగా నిలుస్తోందని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు ఈసీ నిర్ణయం వెలువడగానే ట్విట్టర్ లో ఏక్ నాథ్ షిండే విల్లు-బాణం గుర్తును అప్డేట్ చేశారు.
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?