Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Watermelon Case: పుచ్చకాయ తిని ముంబైకి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వాటర్మిలన్ కొనుగోళ్లను ప్రభావితం చేశాయి. ముంబైలోని ఫ్రూట్ మార్కెట్లో ఒక్కసారిగా పుచ్చకాయ రేట్లు పడిపోయాయి. ఈ ఘటన అంతగా జనాలను భయపెట్టింది.
అయితే, ఈ కేసు సంచలనంగా మారడంతో ఫోరెన్సిక్ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విషప్రయోగం వల్ల వారు మరణించారని నిర్ధారించింది. మృతుల శరీరాల్లో, వారు తిన్న పుచ్చకాయలో ఎలుకల్ని చంపడానికి ఉపయోగించే ఒక విష పదార్థం ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. వారి శరీర అంతర్గత అవయవాలలో ఆకుపచ్చ రంగు కనిపించింది. దీంతో విష ప్రయోగం జరిగినట్లు నివేదిక వెల్లడించడంతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
Also Read
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
- Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
- Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
Read Also: Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
45 ఏళ్ల అబ్దుల్లా డొకాడియా, అతని భార్య 35 ఏళ్ల నస్రీన్, వారి పిల్లలు 13 ఏళ్ల జైనాబ్, 16 ఏళ్ల అయేషాలు ముంబైలోని తమ ఇంట్లో బంధువులకు విందు ఇచ్చారు. మటన్ పులావ్ వడ్డించారు. బంధువులు వెళ్ళిపోయిన కొన్ని గంటల తర్వాత, తెల్లవారుజామున 1 గంటకు ఆ కుటుంబం పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5 గంటలకల్లా, వారందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు అయ్యి, కొన్ని గంటల్లోనే మరణించారు.
ఈ కేసులో పుచ్చకాయలోకి విషం కావాలని ఎవరైనా ఎక్కించారా? లేక ప్రమాదవశాత్తు ఈ విషం దాంట్లోకి చేరిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతుల మెదడు, గుండె, పేగులతో సహా కొన్ని అవయవాలు ఆకుపచ్చగా మారాయి. ఈ కేసులో విందులో పులావ్ తిన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తాజావార్తలు
-
Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
-
AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
-
Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!