Muhammad Yunus: దిగిపోతూ, భారత్పై యూనస్ అక్కసు..‘‘7 సిస్టర్స్ కామెంట్స్’’..
- దిగిపోతున్నా అదే అక్కసు..
- భారత్కు వ్యతిరేకంగా యూనస్ వ్యాఖ్యలు..
- ఈశాన్య రాష్ట్రాల గురించి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muhammad Yunus: బంగ్లాదేశ్లో రాడికల్ శక్తులకు సహాయం చేయడం, మైనారిటీలను రక్షించడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న బంగ్లా తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ దిగిపోతూ భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 2024లో హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత యూనస్ అధికారం చేపట్టి బంగ్లాలో భారత వ్యతిరేకతను పెంచి పోషించాడు.
తాజాగా ఆయన చేసిన ప్రసంగంలో భారత్పై తన వ్యతిరేకతను వెల్లడించారు. విదేశాంగ విధానంలో బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, గౌరవం, స్వాతంత్య్రాన్ని తిరిగి పొందిందని, ఇకపై ఇతన దేశాల ఆదేశాలపై పనిచేయదని చెప్పారు. భారత్ను లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు. భూటాన్, నేపాల్, ‘‘సెవెన్ సిస్టర్స్’’తో బంగ్లాదేశ్ అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. భారతదేశంలోని అంతర్భాగమైన 7 ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
Read Also: Reels Madness: శివుడికి గంజాయి ప్రసాదం.. యువకుల వికృత చేష్టలు.. రంగంలోకి సీపీ సజ్జనార్..
తన హయాంలో చైనా, జపాన్, యూఎస్ఏ, యూరప్తో బంగ్లా సంబంధాలను పెంచానని, భారతదేశ వ్యూహాత్మక ‘‘సిలిగురి కారిడార్’’కు సమీపంలోని తీస్తా నదిపై చైనా సహాయంతో ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు. ఇదే కాకుండా బంగ్లాదేశ్ సైన్యాన్ని విదేశాల దురాక్రమణను ఎదుర్కోవడానికి బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ఇది భారత్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యగా పరిగణిస్తున్నారు.
తాజాగా జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సంచలన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్, బంగ్లాదేశ్ ప్రధానిగా ఫిబ్రవరి 17న ప్రమాణస్వీకారం చేశారు. అయితే, దిగిపోతూ కూడా యూనస్ తన భారత వ్యతిరేకతను దాచుకోలేదు. పరోక్షంగా భారత్తో బంగ్లా సంబంధాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి…
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!