Engineer Rashid: కాశ్మీర్ ఎంపీ ఇంజనీర్ రషీద్కు బెయిల్ తిరస్కరణ..
- ఎంపీ ఇంజనీర్ రషీదుకు బెయిల్ తిరస్కరణ..
- ఎంపీ హోదా జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదన్న ఎన్ఐఏ..
Engineer Rashid: ఉగ్రవాద నిధుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్కి ఢిల్లీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణల కారణంగా రషీద్ 2019 నుంచి జైలులో ఉన్నాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచిన రషీద్, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఎంపీగా అతడి హోదా అతడి జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదని ఎన్ఐఏ కోర్టులో వాదించింది. ఎన్ఐఏ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ని కొట్టివేస్తుందని అదనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ తీర్పు చెప్పారు.
Read Also: PSL: పీఎస్ఎల్ ఫ్రాంచైజ్లో రోహిత్ శర్మ వాయిస్.. ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
2017 ఉగ్రవాద నిధుల కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు(నివారణ) చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 2019 నుంచి రషీద్ తీహార్ జైలులో ఉన్నాడు. ఏప్రిల్ 04 వరకు జరగనున్న లోక్సభ సమావేశాల కోసం తనకు కస్టడీ పెరోల్ లేదా మధ్యంతర బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను మార్చి 10న ఢిల్లీ కోర్టులో సవాల్ చేశాడు. మార్చి 17న, రషీద్ పిటిషన్కి స్పందించిన ఎన్ఐఏ, అతడి ఎంపీ హోదా ఉపయోగించుకోవడానికి అనుమతించమని చెప్పింది. చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నప్పుడు పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడానికి రషీద్కు ఎటువంటి హక్కు లేనందున అతనికి మధ్యంతర బెయిల్ లేదా కస్టడీ పెరోల్ మంజూరు ఇవ్వొద్దని ఏజెన్సీ వాదించింది.
కాశ్మీర్లో సాయుధ గ్రూపులు, ఉగ్రవాద సంస్థలు, వేర్పాటువాదులకు నిధులు సమకూర్చాలనే ఆరోపణలపై ఎన్ఐఏ కాశ్మీర్కి చెందిన వ్యాపారవేత్త జహూర్ వాటాలిని అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే ఇంజనీర్ రషీద్ ప్రమేయం వెలుగులోకి వచ్చింది. వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సహా అనేక మందిపై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది యాసిన్ మాలిక్ తన నేరాన్ని అంగీకరించడంతో 2022లో ట్రయల్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!