Nagpur: ముగ్గురు పిల్లల తల్లితో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి..
- 36 ఏళ్ల మహిళతో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి..
- మహిళకు అప్పటికే ముగ్గురు పిల్లలు..
- 4 నెలల వేట తర్వాత ఇద్దరి గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur: మహారాష్ట్ర నాగ్పూర్లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(16), 36 ఏళ్ల మహిళతో లేచిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ అప్పటికే ముగ్గురు పిల్లల తల్లి. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్లోనిక్రైమ్ బ్రాంచ్లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అతన్ని రక్షించింది. ఈ ఘటనపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సదరు మహిళ విద్యార్థి ఇంటి సమీపంలో నిసించేందని, తరుచుగా వీరిద్దరు ఒకే ఆలయానికి వెళ్లే వారని పోలీసులు తెలిపారు.
నివేదికల ప్రకారం.. టీనేజర్ తండ్రి, తన కూతురి అనారోగ్యం గురించి ఆ మహిళతో మాట్లాడేవాడు. అయితే, ఆ తర్వాత విద్యార్థి ఆ మహిళతో స్నేహం చేశాడు. తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గమనించిన తండ్రి పలుమార్లు అతడిని మందలించాడు. అతడిని, మహిళ నుంచి దూరం చేయడానికి ఓల్డ్ మంగళ్వాడిలోని తన బంధువుల ఇంటికి పంపారు. అయితే, టీనేజ్ విద్యార్థి ఆ మహిళతో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
Read Also: Yogi Adityanath: “హోలీ వర్సెస్ శుక్రవారం నమాజ్”.. పోలీస్ అధికారికి యోగి మద్దతు..
పారిపోయిన తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు లాకాడ్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, కిడ్నాప్ కేసు పెట్టారు. మరోవైపు మహిళ కుటుంబం కూడా స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు తర్వాత పోలీసులు అతడు ఎక్కడున్నాడో కనిపెట్టి, ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మహిళను లకాడ్గంజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించామని, అక్కడ కిడ్నాప్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అరెస్టు తర్వాత, మహిళను కోర్టు ముందు హాజరుపరచగా, ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
వీరిద్దరు డిసెంబర్ 2న పారిపోయారు. నాలుగు నెలల తర్వాత వీరిని మధ్యప్రదేశ్ బాలాఘాట్లో వీరిని గుర్తించారు. సదరు మహిళ తన బంగారు గొలుసును అమ్మి ఇంటిని అద్దెకు తీసుకుని, ఇంటికి కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసింది. మహిళ క్యాటరింగ్ గ్రూప్లో వంట మనిషిగా పనిచేస్తుండగా, టీనేజర్ సర్వీస్ బాయ్గా చేరాడు. అయితే, నాగ్పూర్ పోలీసులు వీరు ఎక్కడ ఉంటున్నారో గుర్తించి అరెస్ట్ చేశారు. టీనేజన్ తన సోదరికి సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేయడంతో, వీరు ఎక్కడ ఉంటున్నారనే వివరాలను పోలీసులు గుర్తించగలిగారు. కుటుంబాలు వీరి వింత వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో కూడా వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయి నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆ మహిళ పెద్ద కొడుకు వయసు 12 ఏళ్లు. పారిపోయిన టీనేజర్ వయసు కన్నా 4 ఏళ్లు చిన్నవాడు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!