Nagpur: ముగ్గురు పిల్లల తల్లితో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి..
- 36 ఏళ్ల మహిళతో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి..
- మహిళకు అప్పటికే ముగ్గురు పిల్లలు..
- 4 నెలల వేట తర్వాత ఇద్దరి గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur: మహారాష్ట్ర నాగ్పూర్లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(16), 36 ఏళ్ల మహిళతో లేచిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ అప్పటికే ముగ్గురు పిల్లల తల్లి. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్లోనిక్రైమ్ బ్రాంచ్లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అతన్ని రక్షించింది. ఈ ఘటనపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సదరు మహిళ విద్యార్థి ఇంటి సమీపంలో నిసించేందని, తరుచుగా వీరిద్దరు ఒకే ఆలయానికి వెళ్లే వారని పోలీసులు తెలిపారు.
నివేదికల ప్రకారం.. టీనేజర్ తండ్రి, తన కూతురి అనారోగ్యం గురించి ఆ మహిళతో మాట్లాడేవాడు. అయితే, ఆ తర్వాత విద్యార్థి ఆ మహిళతో స్నేహం చేశాడు. తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గమనించిన తండ్రి పలుమార్లు అతడిని మందలించాడు. అతడిని, మహిళ నుంచి దూరం చేయడానికి ఓల్డ్ మంగళ్వాడిలోని తన బంధువుల ఇంటికి పంపారు. అయితే, టీనేజ్ విద్యార్థి ఆ మహిళతో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు.
Also Read
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
Read Also: Yogi Adityanath: “హోలీ వర్సెస్ శుక్రవారం నమాజ్”.. పోలీస్ అధికారికి యోగి మద్దతు..
పారిపోయిన తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు లాకాడ్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, కిడ్నాప్ కేసు పెట్టారు. మరోవైపు మహిళ కుటుంబం కూడా స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు తర్వాత పోలీసులు అతడు ఎక్కడున్నాడో కనిపెట్టి, ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మహిళను లకాడ్గంజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించామని, అక్కడ కిడ్నాప్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అరెస్టు తర్వాత, మహిళను కోర్టు ముందు హాజరుపరచగా, ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
వీరిద్దరు డిసెంబర్ 2న పారిపోయారు. నాలుగు నెలల తర్వాత వీరిని మధ్యప్రదేశ్ బాలాఘాట్లో వీరిని గుర్తించారు. సదరు మహిళ తన బంగారు గొలుసును అమ్మి ఇంటిని అద్దెకు తీసుకుని, ఇంటికి కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసింది. మహిళ క్యాటరింగ్ గ్రూప్లో వంట మనిషిగా పనిచేస్తుండగా, టీనేజర్ సర్వీస్ బాయ్గా చేరాడు. అయితే, నాగ్పూర్ పోలీసులు వీరు ఎక్కడ ఉంటున్నారో గుర్తించి అరెస్ట్ చేశారు. టీనేజన్ తన సోదరికి సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేయడంతో, వీరు ఎక్కడ ఉంటున్నారనే వివరాలను పోలీసులు గుర్తించగలిగారు. కుటుంబాలు వీరి వింత వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో కూడా వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయి నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆ మహిళ పెద్ద కొడుకు వయసు 12 ఏళ్లు. పారిపోయిన టీనేజర్ వయసు కన్నా 4 ఏళ్లు చిన్నవాడు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!