Daughter in Law Remarriage: కోవిడ్తో కొడుకు మృతి.. కోడలికి రెండో పెళ్లి, భారీ గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకటి నింపింది.. కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి.. ఇక, కొందరు కుటుంబ పెద్దను కోల్పోతే.. మరికొందరు కొడుకులను.. ఇంకా కొందరు కోడళ్లను, మనవలు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మందిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. మన అనుకున్నవాళ్లే దూరం పెట్టే రోజులు కూడా చూపింది కరోనా.. అయితే, మధ్యప్రదేశ్కి చెందిన ఓ దంపతులు చేసిన పనిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. సాధారణంగా అత్తమామలు అంటే.. కోడళ్లను రాకిరంపాన పెడతారనే అపవాదు ఉంది.. కానీ, ఇక్కడ.. తమ కొడుకు మృతిచెందిన చేదు వార్తను దిగమింగి.. తమ కోడలికి తల్లిదండ్రులుగా మారిపోయి.. రెండో వివాహం చేశారు.. తమ ఆస్తిని కూడా రాసిచ్చారు.
Read Also: Chandrababu: ముగిసిన కుప్పం టూర్.. ఇక, 3 నెలలకోసారి పర్యటన..
Also Read
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్ప్రకాష్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి.. 2021 ఏప్రిల్ 25వ తేదీన కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. భోపాల్ నెట్లింక్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే ఆయన మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అతడికి 2011 నవంబర్ 27వ తేదీన పెళ్లి జరిగింది.. ప్రస్తుతం వారికి అన్య తివారీ (9) కూతురు కూడా ఉంది. ప్రియాంక్ మృతితో అతని భార్య వితంతువుగా మారిపోయింది. అయితే, కోడలు, తొమ్మిదేళ్ల మనవరాలి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోవద్దని ఆమె అత్త, మామ ఓ నిర్ణయానికి వచ్చారు.. ఆమెను తమ కూతురిలా భావించి.. మరో వ్యక్తితో పెళ్లి చేసి.. కోడలికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వితంతువు అయిన కోడలు రిచా తివారీని అక్షయ తృతీయ నాడు నాగ్పూర్ నివాసి వరుణ్ మిశ్రాకు ఇచ్చి వివాహం జరిపించారు. అంతేకాదు.. తన సొంత ఖర్చుతో వైభవంగా కోడలికి పెళ్లి చేశారు.. తమ కుమారుడు కొనుగోలు చేసిన ఇంటిని కూడా కోడలికి రాసిచ్చి పెద్ద మనస్సు చాటుకున్నారు.. ఆ బంగ్లా విలువగా రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి తర్వాత అన్య కూడా తన తల్లితో కలిసి నాగ్పూర్కు వెళ్లింది. ప్రియాంక్ మరణానంతరం అతని భార్య రిచాకు కంపెనీ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయాయి.. ప్రియాంకకు తల్లిదండ్రులుగా మారి బాధ్యత తీసుకున్న ఆమె అత్తామామలపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!