Daughter in Law Remarriage: కోవిడ్తో కొడుకు మృతి.. కోడలికి రెండో పెళ్లి, భారీ గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకటి నింపింది.. కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి.. ఇక, కొందరు కుటుంబ పెద్దను కోల్పోతే.. మరికొందరు కొడుకులను.. ఇంకా కొందరు కోడళ్లను, మనవలు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మందిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. మన అనుకున్నవాళ్లే దూరం పెట్టే రోజులు కూడా చూపింది కరోనా.. అయితే, మధ్యప్రదేశ్కి చెందిన ఓ దంపతులు చేసిన పనిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. సాధారణంగా అత్తమామలు అంటే.. కోడళ్లను రాకిరంపాన పెడతారనే అపవాదు ఉంది.. కానీ, ఇక్కడ.. తమ కొడుకు మృతిచెందిన చేదు వార్తను దిగమింగి.. తమ కోడలికి తల్లిదండ్రులుగా మారిపోయి.. రెండో వివాహం చేశారు.. తమ ఆస్తిని కూడా రాసిచ్చారు.
Read Also: Chandrababu: ముగిసిన కుప్పం టూర్.. ఇక, 3 నెలలకోసారి పర్యటన..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్ప్రకాష్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి.. 2021 ఏప్రిల్ 25వ తేదీన కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. భోపాల్ నెట్లింక్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే ఆయన మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అతడికి 2011 నవంబర్ 27వ తేదీన పెళ్లి జరిగింది.. ప్రస్తుతం వారికి అన్య తివారీ (9) కూతురు కూడా ఉంది. ప్రియాంక్ మృతితో అతని భార్య వితంతువుగా మారిపోయింది. అయితే, కోడలు, తొమ్మిదేళ్ల మనవరాలి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోవద్దని ఆమె అత్త, మామ ఓ నిర్ణయానికి వచ్చారు.. ఆమెను తమ కూతురిలా భావించి.. మరో వ్యక్తితో పెళ్లి చేసి.. కోడలికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వితంతువు అయిన కోడలు రిచా తివారీని అక్షయ తృతీయ నాడు నాగ్పూర్ నివాసి వరుణ్ మిశ్రాకు ఇచ్చి వివాహం జరిపించారు. అంతేకాదు.. తన సొంత ఖర్చుతో వైభవంగా కోడలికి పెళ్లి చేశారు.. తమ కుమారుడు కొనుగోలు చేసిన ఇంటిని కూడా కోడలికి రాసిచ్చి పెద్ద మనస్సు చాటుకున్నారు.. ఆ బంగ్లా విలువగా రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి తర్వాత అన్య కూడా తన తల్లితో కలిసి నాగ్పూర్కు వెళ్లింది. ప్రియాంక్ మరణానంతరం అతని భార్య రిచాకు కంపెనీ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయాయి.. ప్రియాంకకు తల్లిదండ్రులుగా మారి బాధ్యత తీసుకున్న ఆమె అత్తామామలపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!