Daughter in Law Remarriage: కోవిడ్తో కొడుకు మృతి.. కోడలికి రెండో పెళ్లి, భారీ గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకటి నింపింది.. కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి.. ఇక, కొందరు కుటుంబ పెద్దను కోల్పోతే.. మరికొందరు కొడుకులను.. ఇంకా కొందరు కోడళ్లను, మనవలు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మందిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. మన అనుకున్నవాళ్లే దూరం పెట్టే రోజులు కూడా చూపింది కరోనా.. అయితే, మధ్యప్రదేశ్కి చెందిన ఓ దంపతులు చేసిన పనిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. సాధారణంగా అత్తమామలు అంటే.. కోడళ్లను రాకిరంపాన పెడతారనే అపవాదు ఉంది.. కానీ, ఇక్కడ.. తమ కొడుకు మృతిచెందిన చేదు వార్తను దిగమింగి.. తమ కోడలికి తల్లిదండ్రులుగా మారిపోయి.. రెండో వివాహం చేశారు.. తమ ఆస్తిని కూడా రాసిచ్చారు.
Read Also: Chandrababu: ముగిసిన కుప్పం టూర్.. ఇక, 3 నెలలకోసారి పర్యటన..
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్ప్రకాష్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి.. 2021 ఏప్రిల్ 25వ తేదీన కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. భోపాల్ నెట్లింక్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే ఆయన మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అతడికి 2011 నవంబర్ 27వ తేదీన పెళ్లి జరిగింది.. ప్రస్తుతం వారికి అన్య తివారీ (9) కూతురు కూడా ఉంది. ప్రియాంక్ మృతితో అతని భార్య వితంతువుగా మారిపోయింది. అయితే, కోడలు, తొమ్మిదేళ్ల మనవరాలి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోవద్దని ఆమె అత్త, మామ ఓ నిర్ణయానికి వచ్చారు.. ఆమెను తమ కూతురిలా భావించి.. మరో వ్యక్తితో పెళ్లి చేసి.. కోడలికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వితంతువు అయిన కోడలు రిచా తివారీని అక్షయ తృతీయ నాడు నాగ్పూర్ నివాసి వరుణ్ మిశ్రాకు ఇచ్చి వివాహం జరిపించారు. అంతేకాదు.. తన సొంత ఖర్చుతో వైభవంగా కోడలికి పెళ్లి చేశారు.. తమ కుమారుడు కొనుగోలు చేసిన ఇంటిని కూడా కోడలికి రాసిచ్చి పెద్ద మనస్సు చాటుకున్నారు.. ఆ బంగ్లా విలువగా రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి తర్వాత అన్య కూడా తన తల్లితో కలిసి నాగ్పూర్కు వెళ్లింది. ప్రియాంక్ మరణానంతరం అతని భార్య రిచాకు కంపెనీ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయాయి.. ప్రియాంకకు తల్లిదండ్రులుగా మారి బాధ్యత తీసుకున్న ఆమె అత్తామామలపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
తాజావార్తలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!