Suicide In India: యువతకు ఏమైంది..? భారత్లో పెరిగిన ఆత్మహత్యలు..
- భారతదేశ యువతకు ఏమైంది..?
- ప్రపంచంతో పోలిస్తే దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide In India: ఇతర దేశాల కంటే భారతదేశంలో ఎక్కువ మంది యవత ఆత్మహత్యకు పాల్పడుతున్నారని మంగళవారం ‘‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం’’ సందర్భంగా నిపుణులు చెప్పారు. అవగాహన పెంచడానికి ప్రతీ ఏడాది సెప్టెంబర్ 10న ప్రపంచ ఆరోగ్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ ‘‘ఆత్మహత్యపై కథనాన్ని మార్చాలి’’. భారతదేశంలో కౌమారదశ( 15-19 ఏళ్లు) యువతలో ఆత్మహత్యలు, మరణాలకు నాలుగో ప్రధాన కారణం అవుతున్నాయని అంచనా వేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. ఆత్మహత్యలకు పాల్పడే కేసుల్లో 40 శాతానికి పైగా 30 ఏళ్ల లోపు యువతే ఉంటోంది.
“భారతదేశంలో, దురదృష్టవశాత్తు ఆత్మహత్యల ద్వారా మరణించే యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గ్లోబల్ యావరేజ్తో పోలిస్తే భారత్లో ఆత్మహత్య చేసుకున్న యువకుల సంఖ్య దాదాపు రెట్టింపు. భారతదేశంలో రోజుకు సుమారు 160 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ”అని ఎయిమ్స్లోని సైకియాట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నంద్ కుమార్ చెప్పారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: Haryana Polls: బీజేపీ రెండో జాబితా విడుదల.. 21 మంది అభ్యర్థుల ప్రకటన
ఒత్తిడితో కూడిన కుటుంబ వాతావరణం, అస్థిర భావోద్వేగాలు, రిలేషన్స్ విఫలం కావడం, స్నేహితుల మధ్య బలహీనమైన బంధం, ఒంటరితనం అనేవి యువతలో ఆత్మహత్యలని ప్రేరేపించి మరణాలకు కారణమవుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం..2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ‘‘15 నుంచి 39 ఏళ్ల వయసు గల వ్యక్తుల మరణాలకు ప్రధాన కారణం ఆత్మహత్య. ప్రపంచవ్యాప్తంగా, మనదేశంలో మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సంక్షోభాల్లో ఒకటి’’ అని లైవ్లవ్లాఫ్ యొక్క సైకియాట్రిస్ట్ మరియు చైర్పర్సన్ డాక్టర్ శ్యామ్ భట్ చెప్పారు.
ఆత్మహత్యల రేటుని తగ్గించడానికి ఎక్కువ అవగాహన, సంరక్షణ, అంతర్లీన సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడం చాలా అవసరమని, మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్న వారికి దయతో అక్కున చేర్చుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మనస్తలి వ్యవస్థాపక-డైరెక్టర్ మరియు సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతి కపూర్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ మరియు కిరణ్ హెల్ప్లైన్ వంటి కార్యక్రమాలను ప్రారంభించిందని అన్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!