Mohammed Shami: షమీకి మద్దతుగా దేశం.. జమాత్ చీఫ్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
- మహ్మద్ షమీకి మద్దతుగా దేశం..
- జమాత్ ఛీఫ్ వ్యాఖ్యలపై పలువురి ఆగ్రహం..
- ఫైనల్పై షమీ దృష్టి పెట్టాలంటూ సూచన..
- మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యలపై బీజేపీ నేత ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఉద్దేశించి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం దారుణమైన విమర్శలు చేయడంపై క్రీడాభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మతాన్ని ఆపాదించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్ మాసంలో ‘రోజా’ను పాటించకుండా, మ్యాచ్ సమయంలో షమీ నీరు, ఇతర డ్రింక్స్ తాగడాని షాబుద్దీన్ అన్నారు. షమీని క్రిమినల్గా పోల్చుతూ విమర్శించారు.
Read Also: Mohammed Shami: మహ్మద్ షమీ “క్రిమినల్”.. ముస్లిం సంస్థ చీఫ్ ఆగ్రహం.. ఏమైందంటే..
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
అయితే, ఇప్పుడు దేశం మొత్తం షమీకి మద్దతుగా నిలుస్తోంది. షమీ కజిన్ డాక్టర్ ముంతాజ్ మాట్లాడుతూ..‘‘అతను దేశం తరపున ఆడుతున్నాడు. ‘రోజా’ను పాటించని పాకిస్తాన్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు, వారు మ్యాచ్లు ఆడుతున్నారు, కాబట్టి ఇది కొత్తేమీ కాదు. షమీ గురించి ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా సిగ్గుచేటు. ఈ విషయాలను పట్టించుకోవద్దని, మార్చి 9న జరిగే మ్యాచ్కు సిద్ధం కావాలని మేము మహ్మద్ షమీకి చెబుతాము’’ అని అన్నారు.
మరోవైపు, బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ జమాత్ చీఫ్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొందరు మనుషులు ‘‘ ఫత్వాలు జారీ చేసే దుకాణాలు’’ తెరుస్తున్నారు. కూరగాయల వలే ఫత్వాలను అమ్ముతున్నారు. అయితే, ఎవరూ కూడా వారి ఫత్వాలను కొనడం లేదు. వారంతా మూర్ఖులు’’ అని అన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్లో షమీ, రోజాను పాటించలేదని షాబుద్దీన్ విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!