PM Modi: మోడీ సంచలన నిర్ణయం.. రంగంలోకి త్రివిధ దళాలు..
- పహల్గామ్ దాడికి ప్రతీకారానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ..
- సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ..
- టార్గెట్ ప్లేస్, టైమ్ అన్ని నిర్ణయాలు సైన్యం చేతిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని మోడీ ఆదేశించారు.
90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
Also Read
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
Read Also: Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్
భారత సాయుధ దళాల సామర్థ్యాలపై ప్రధాని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైన్యమే టార్గెట్ ప్లేస్, టైమ్ చూసి జవాబు ఇచ్చేలా త్రివిధ దళాలకు ‘‘పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ’’ను ఇచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని నేతృత్వంలో జరిగిన రెండో అత్యున్నత సమావేశం ఇదే. అంతకు కొన్ని రోజుల ముందు ‘‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’ సమావేశమైంది. తాజాగా, ఈ రోజు త్రివిధ దళాలుతో మోడీ సమావేశం కావడం గమనార్హం.
ఇప్పటికే పాకిస్తాన్పై భారత్ దౌత్య యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ 80 శాతం జనాభాకు జీవనాడి అయిన ‘‘సింధు నది’’కి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’రద్దు చేసింది. దీంతో పాటు పాక్ జాతీయుల వీసాలను రద్దు చేసి, దేశం వదిలి వెళ్లాలని డెడ్లైన్ విధించింది. అట్టారీ-వాఘా బోర్డర్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇప్పుడు మిలిటరీ యాక్షన్కి కూడా ప్రధాని మోడీ పర్మిషన్ ఇవ్వడం సంచలనంగా మారింది. మిలిటరీ యాక్షన్ తీసుకుంటారా..?, లేక పూర్తి స్థాయి యుద్ధానికి జరుగుతుందా..? అనేది ప్రజల్లో ఆసక్తి ఉంది.
తాజావార్తలు
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!