PM Modi: మోడీ సంచలన నిర్ణయం.. రంగంలోకి త్రివిధ దళాలు..
- పహల్గామ్ దాడికి ప్రతీకారానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ..
- సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ..
- టార్గెట్ ప్లేస్, టైమ్ అన్ని నిర్ణయాలు సైన్యం చేతిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని మోడీ ఆదేశించారు.
90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Read Also: Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్
భారత సాయుధ దళాల సామర్థ్యాలపై ప్రధాని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైన్యమే టార్గెట్ ప్లేస్, టైమ్ చూసి జవాబు ఇచ్చేలా త్రివిధ దళాలకు ‘‘పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ’’ను ఇచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని నేతృత్వంలో జరిగిన రెండో అత్యున్నత సమావేశం ఇదే. అంతకు కొన్ని రోజుల ముందు ‘‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’ సమావేశమైంది. తాజాగా, ఈ రోజు త్రివిధ దళాలుతో మోడీ సమావేశం కావడం గమనార్హం.
ఇప్పటికే పాకిస్తాన్పై భారత్ దౌత్య యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ 80 శాతం జనాభాకు జీవనాడి అయిన ‘‘సింధు నది’’కి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’రద్దు చేసింది. దీంతో పాటు పాక్ జాతీయుల వీసాలను రద్దు చేసి, దేశం వదిలి వెళ్లాలని డెడ్లైన్ విధించింది. అట్టారీ-వాఘా బోర్డర్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇప్పుడు మిలిటరీ యాక్షన్కి కూడా ప్రధాని మోడీ పర్మిషన్ ఇవ్వడం సంచలనంగా మారింది. మిలిటరీ యాక్షన్ తీసుకుంటారా..?, లేక పూర్తి స్థాయి యుద్ధానికి జరుగుతుందా..? అనేది ప్రజల్లో ఆసక్తి ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!