PM Modi: మోడీ సంచలన నిర్ణయం.. రంగంలోకి త్రివిధ దళాలు..
- పహల్గామ్ దాడికి ప్రతీకారానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ..
- సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ..
- టార్గెట్ ప్లేస్, టైమ్ అన్ని నిర్ణయాలు సైన్యం చేతిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని మోడీ ఆదేశించారు.
90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
Also Read
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Read Also: Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్
భారత సాయుధ దళాల సామర్థ్యాలపై ప్రధాని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైన్యమే టార్గెట్ ప్లేస్, టైమ్ చూసి జవాబు ఇచ్చేలా త్రివిధ దళాలకు ‘‘పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ’’ను ఇచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని నేతృత్వంలో జరిగిన రెండో అత్యున్నత సమావేశం ఇదే. అంతకు కొన్ని రోజుల ముందు ‘‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’’ సమావేశమైంది. తాజాగా, ఈ రోజు త్రివిధ దళాలుతో మోడీ సమావేశం కావడం గమనార్హం.
ఇప్పటికే పాకిస్తాన్పై భారత్ దౌత్య యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ 80 శాతం జనాభాకు జీవనాడి అయిన ‘‘సింధు నది’’కి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’రద్దు చేసింది. దీంతో పాటు పాక్ జాతీయుల వీసాలను రద్దు చేసి, దేశం వదిలి వెళ్లాలని డెడ్లైన్ విధించింది. అట్టారీ-వాఘా బోర్డర్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఇప్పుడు మిలిటరీ యాక్షన్కి కూడా ప్రధాని మోడీ పర్మిషన్ ఇవ్వడం సంచలనంగా మారింది. మిలిటరీ యాక్షన్ తీసుకుంటారా..?, లేక పూర్తి స్థాయి యుద్ధానికి జరుగుతుందా..? అనేది ప్రజల్లో ఆసక్తి ఉంది.
తాజావార్తలు
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
-
Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..