PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..
- మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని మోడీ ఫైర్..
- బుజ్జగింపు రాజకీయాలకు చెక్ పెడుతామని హామీ..
- బెంగాలీలను మైనారిటీలు కానివ్వమని కామెంట్స్..
- అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో యూసీసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పు వేగవంతంగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు తాము ‘‘ఉమ్మడి పౌరస్మృతి’’ తీసుకువస్తున్నామని శనివారం ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బెంగాలీలు మైనారిటీలు కాకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పారు.
ముస్లింల ఆధిపత్యం ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్లో బహిరంగం సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ సాగిస్తున్న ‘‘మహా జంగిల్ రాజ్’’ పాలనకు ముగింపు పలికేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్షా విడుదల చేసిన బీజేపీ ఎన్నికల మానిఫెస్టో ఒక మార్గసూచిక అని మోడీ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని చెప్పారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: US-Iran Talks: “అమెరికాను నమ్మలేం”.. చర్చల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్..
ఆర్జీకర్ హత్యాచార కేసులో నిందితులకు మమతా సర్కార్ ఎలా అండగా నిలిచిందో రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఆయన అన్నారు. ‘‘మా -మాటీ-మనుష్’’ అనే నినాదంతో టీఎంసీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పుడు చొరబాటుదారుల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ బుజ్జగింపు, ఓట్ బ్యాంక్ రాజకీయాల ఆటను ఇకపై బెంగాల్ సహించదని, రాష్ట్రంలో బెంగాలీలు మైనారిటీలుగా మారడానికి తాము అంగీకరించమని ప్రధాని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరుల్ని జైలుకు పంపుతామని చెప్పారు.
భారత్ అంతా శ్రీరామ నవమి జరుపుకుంటే, బెంగాల్లో టీఎంసీ అండతో రామనవమి ర్యాలీపై దాడులు జరుగుతున్నాయని, హింస చోటుచేసుకుంటుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఖామని భావించి, కుట్రలకు పాల్పడుతూ ఏఐ వీడియోలను వ్యాప్తి చేస్తుందని ప్రధాని ఆరోపించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!