Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్కు చేదు అనుభవం.. “మోడీ..మోడీ” అంటూ నినాదాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలో ఇంద్రప్రస్థ యూనివర్సిటీ(ఐపీ యూనివర్సిటీ) కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి చేదు అనుభవం ఎదురైంది. గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ తూర్పు ఢిల్లీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న క్రమంలో అక్కడ ఉన్న విద్యార్థులు మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన గురువారం జరిగింది. దీనికి ప్రతిస్పందనగా కేజ్రీవాల్ చిరునవ్వుతో స్పందిస్తూ.. నేను చెప్పేది 5 నిమిషాలు వినాలని, చేతులు జోడించి అభ్యర్థిస్తున్నానని, మీకు నచ్చకపోతే, మీరు ఆ తర్వాత నినాదలు చేయడం కొనసాగించవచ్చని ఆయన అన్నారు.
Read Also: Monsoon: ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా వర్షాలు..
Also Read
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ఇలాంటి నినాదాలు చేయడం ద్వారా విద్యావ్యవస్థ మెరుగుపడి ఉంటే, గత 70 ఏళ్లలో జరిగి ఉండేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు గొడవకు పాల్పడ్డారని ఆరోపించింది. నా ఆలోచనలు మీకు నచ్చకపోవచ్చని నాకు తెలుసు.. మీరు వ్యాఖ్యలు చేయవచ్చు కానీ ఇలా చేయడం సరైంది కాదని, ఈ రోజు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషిని కూడా కొంతమంది ఎగతాళి చేశారు. దీనికి ప్రతిగా అతిషి మాట్లాడుతూ..‘‘ ఇందుకే విద్య అవసరం’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
ప్రారంభోత్సవ వేడుక జరుగుతున్నప్పుడు క్యాంపస్ వెలుపల ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య నినాదాలు చోటు చేసుకున్నాయి. గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం యొక్క తూర్పు ఢిల్లీ క్యాంపస్ ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి వివాదాస్పదంగా మారింది. కొత్తగా నిర్మించిన క్యాంపస్ ని తామే ప్రారంభిస్తామని ఇరుపక్షాలు పేర్కొంటున్నాయి. క్యాంపస్ నిర్మాణ క్రెడిట్ తీసుకునేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి.
BJP कार्यकर्ताओं ने GGSIPU के उद्घाटन में मचाया हुड़दंग‼️
CM @ArvindKejriwal ने नारे लगाने वालों को दिया शानदार जवाब-
"अगर ऐसे नारे लगाने से शिक्षा व्यवस्था अच्छी हो जाती तो 70 साल में हो गई होती" pic.twitter.com/yGyVlxzKhi
— AAP (@AamAadmiParty) June 8, 2023
💯 🔥 इसलिए शिक्षा जरूरी है 🔥💯
BJP के समर्थक नारे लगाकर कार्यक्रम की शोभा बिगाड़ने लगे, तो शिक्षा मंत्री @AtishiAAP ने एक लाइन बोलकर चुप कराया। pic.twitter.com/r8oXoTZlcF
— AAP (@AamAadmiParty) June 8, 2023
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?