Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్కు చేదు అనుభవం.. “మోడీ..మోడీ” అంటూ నినాదాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలో ఇంద్రప్రస్థ యూనివర్సిటీ(ఐపీ యూనివర్సిటీ) కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి చేదు అనుభవం ఎదురైంది. గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ తూర్పు ఢిల్లీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న క్రమంలో అక్కడ ఉన్న విద్యార్థులు మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన గురువారం జరిగింది. దీనికి ప్రతిస్పందనగా కేజ్రీవాల్ చిరునవ్వుతో స్పందిస్తూ.. నేను చెప్పేది 5 నిమిషాలు వినాలని, చేతులు జోడించి అభ్యర్థిస్తున్నానని, మీకు నచ్చకపోతే, మీరు ఆ తర్వాత నినాదలు చేయడం కొనసాగించవచ్చని ఆయన అన్నారు.
Read Also: Monsoon: ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా వర్షాలు..
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
ఇలాంటి నినాదాలు చేయడం ద్వారా విద్యావ్యవస్థ మెరుగుపడి ఉంటే, గత 70 ఏళ్లలో జరిగి ఉండేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు గొడవకు పాల్పడ్డారని ఆరోపించింది. నా ఆలోచనలు మీకు నచ్చకపోవచ్చని నాకు తెలుసు.. మీరు వ్యాఖ్యలు చేయవచ్చు కానీ ఇలా చేయడం సరైంది కాదని, ఈ రోజు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషిని కూడా కొంతమంది ఎగతాళి చేశారు. దీనికి ప్రతిగా అతిషి మాట్లాడుతూ..‘‘ ఇందుకే విద్య అవసరం’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
ప్రారంభోత్సవ వేడుక జరుగుతున్నప్పుడు క్యాంపస్ వెలుపల ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య నినాదాలు చోటు చేసుకున్నాయి. గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం యొక్క తూర్పు ఢిల్లీ క్యాంపస్ ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి వివాదాస్పదంగా మారింది. కొత్తగా నిర్మించిన క్యాంపస్ ని తామే ప్రారంభిస్తామని ఇరుపక్షాలు పేర్కొంటున్నాయి. క్యాంపస్ నిర్మాణ క్రెడిట్ తీసుకునేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి.
BJP कार्यकर्ताओं ने GGSIPU के उद्घाटन में मचाया हुड़दंग‼️
CM @ArvindKejriwal ने नारे लगाने वालों को दिया शानदार जवाब-
"अगर ऐसे नारे लगाने से शिक्षा व्यवस्था अच्छी हो जाती तो 70 साल में हो गई होती" pic.twitter.com/yGyVlxzKhi
— AAP (@AamAadmiParty) June 8, 2023
💯 🔥 इसलिए शिक्षा जरूरी है 🔥💯
BJP के समर्थक नारे लगाकर कार्यक्रम की शोभा बिगाड़ने लगे, तो शिक्षा मंत्री @AtishiAAP ने एक लाइन बोलकर चुप कराया। pic.twitter.com/r8oXoTZlcF
— AAP (@AamAadmiParty) June 8, 2023
తాజావార్తలు
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!