Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్కు చేదు అనుభవం.. “మోడీ..మోడీ” అంటూ నినాదాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలో ఇంద్రప్రస్థ యూనివర్సిటీ(ఐపీ యూనివర్సిటీ) కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి చేదు అనుభవం ఎదురైంది. గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ తూర్పు ఢిల్లీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్న క్రమంలో అక్కడ ఉన్న విద్యార్థులు మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన గురువారం జరిగింది. దీనికి ప్రతిస్పందనగా కేజ్రీవాల్ చిరునవ్వుతో స్పందిస్తూ.. నేను చెప్పేది 5 నిమిషాలు వినాలని, చేతులు జోడించి అభ్యర్థిస్తున్నానని, మీకు నచ్చకపోతే, మీరు ఆ తర్వాత నినాదలు చేయడం కొనసాగించవచ్చని ఆయన అన్నారు.
Read Also: Monsoon: ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా వర్షాలు..
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ఇలాంటి నినాదాలు చేయడం ద్వారా విద్యావ్యవస్థ మెరుగుపడి ఉంటే, గత 70 ఏళ్లలో జరిగి ఉండేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు గొడవకు పాల్పడ్డారని ఆరోపించింది. నా ఆలోచనలు మీకు నచ్చకపోవచ్చని నాకు తెలుసు.. మీరు వ్యాఖ్యలు చేయవచ్చు కానీ ఇలా చేయడం సరైంది కాదని, ఈ రోజు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషిని కూడా కొంతమంది ఎగతాళి చేశారు. దీనికి ప్రతిగా అతిషి మాట్లాడుతూ..‘‘ ఇందుకే విద్య అవసరం’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
ప్రారంభోత్సవ వేడుక జరుగుతున్నప్పుడు క్యాంపస్ వెలుపల ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య నినాదాలు చోటు చేసుకున్నాయి. గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం యొక్క తూర్పు ఢిల్లీ క్యాంపస్ ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి వివాదాస్పదంగా మారింది. కొత్తగా నిర్మించిన క్యాంపస్ ని తామే ప్రారంభిస్తామని ఇరుపక్షాలు పేర్కొంటున్నాయి. క్యాంపస్ నిర్మాణ క్రెడిట్ తీసుకునేందుకు ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి.
BJP कार्यकर्ताओं ने GGSIPU के उद्घाटन में मचाया हुड़दंग‼️
CM @ArvindKejriwal ने नारे लगाने वालों को दिया शानदार जवाब-
"अगर ऐसे नारे लगाने से शिक्षा व्यवस्था अच्छी हो जाती तो 70 साल में हो गई होती" pic.twitter.com/yGyVlxzKhi
— AAP (@AamAadmiParty) June 8, 2023
💯 🔥 इसलिए शिक्षा जरूरी है 🔥💯
BJP के समर्थक नारे लगाकर कार्यक्रम की शोभा बिगाड़ने लगे, तो शिक्षा मंत्री @AtishiAAP ने एक लाइन बोलकर चुप कराया। pic.twitter.com/r8oXoTZlcF
— AAP (@AamAadmiParty) June 8, 2023
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!