Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Modi In Rashtra Shinde In Maharashtra Ad Fuels Bjp Sena Rift Rumours

Maharashtra: “దేశంలో మోడీ.. రాష్ట్రంలో షిండే”.. బీజేపీ-శివసేన మధ్య చిచ్చుపెట్టిన యాడ్..

Published Date :June 13, 2023 , 6:36 pm
By BV Reddy
Maharashtra: “దేశంలో మోడీ.. రాష్ట్రంలో షిండే”.. బీజేపీ-శివసేన మధ్య చిచ్చుపెట్టిన యాడ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maharashtra: మహరాష్ట్రలో పాలక బీజేపీ- శివసేన(ఏక్ నాథ్ షిండే) కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓ పత్రికా ప్రకటన ఈ రెండు పార్టీల మధ్య విబేధాలకు కారణం అవుతోంది. ‘‘దేశంలో మోడీ.. మహారాష్ట్రలో షిండే’’ అనే ట్యాగ్ లైన్ తో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ పత్రికా ప్రకటన వేయించింది. ఈ ప్రకటన బీజేపీలో అసంతృప్తికి కారణం అవుతోంది. ఈ పత్రికా ప్రకటనపై ప్రతిపక్ష ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేనలు ఫైర్ అవుతున్నాయి.

గతంలో మహారాష్ట్రలో బీజేపీ ఇలాగే ‘‘ ఢిల్లీమే నరేంద్ర ఔర్ రాజ్య మే దేవేంద్ర’’ అని ప్రచారం చేసింది. గతేడాది శివసేన పార్టీలో అసమ్మతి తరువాత మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా నిలిచారు. దీంతో బీజేపీ- శివసేన(ఏక్ నాథ్ షిండే) కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతవరకు ఉద్దశ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం మహావికాస్ అఘాడీ గద్దె దిగాల్సి వచ్చింది. ఏక్ నాథ్ షిండే సీఎం, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో షిండే క్యాంప్ నాయకులు బహిరంగంగానే బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ తమను సవతి తల్లిలా చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎంగా ఏక్ నాథ్ షిండేకు 26.1 శాతం మద్దతు, ఫడ్నవీస్ కు 23 శాతం మద్దతు ఉన్నట్లు ఓ ప్రైవేట్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇరు పార్టీలకు కలిసి 46 శాతం ప్రజాధరణ ఉన్నట్లు సర్వేలో తేలింది. బీజేపీకి 30.2 శాతం, షిండే శివసేనకు 16.2 శాతం ప్రజలు మద్దతు పలికారని ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: Gambhir vs Dhoni: ఎంఎస్ ధోనీ వల్ల భారత్‌కు ప్రపంచకప్‌లు రాలేదు.. అసలు హీరో అతడే: గంభీర్

ప్రధాని మోడీ, సీఎం ఏక్ నాథ్ షిండేలు ప్రారంభించిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, పథకాల వల్లే పాపులారిటీ పెరిగిందని యాడ్ పేర్కొంది. ఇదిలా ఉంటే బాలా సాహెబ్ ఠాక్రే గురించి ప్రస్తావన లేకపోవడంపై ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయాలను ప్రకటన కోసం ఖర్చు చేసినట్లు ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలను చూసి షిండే వర్గం ఎంతగానో భయపడుతోందని, ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఠాక్రేను పూర్తిగా మర్చిపోయారని రౌత్ ట్వీట్‌ చేశారు. ‘‘ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో దినపత్రికల్లో ఇలాంటి ప్రకటనలు చూడలేదు. ఆ ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం షిండే ఫొటోలు ఉన్నాయి. వారు (శివసేన) వారు బాలాసాహెబ్ ఠాక్రే సైనికులని చెప్పారు, అయితే బాలాసాహెబ్ థాకరే మరియు ఆనంద్ డిఘేల ఫోటోలు ప్రకటనలో లేవు’’ అని ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమర్శించారు.

అయితే బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దారేకర్ మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే ప్రకటనపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఇందులో దేవేంద్ర ఫడ్నవీస్ ను తక్కువగా చేసినట్లు ఉందని, ఇద్దరం కలిసి ప్రతిపక్షాలకు బలం చూపాలని, షిండే వర్గంలోని 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలోకి తెచ్చాయని శివసేన ఎంపీ గజన కిరీటికర్ అనడాన్ని తప్పుపట్టారు.

कोट्यावधी रुपये खर्च करून केलेली ही जाहिरातबाजी.या आनंदाच्या क्षणी मा.मू. एकनाथ शिंदे यांना शिवसेना प्रमुख बाळासाहेब ठाकरे यांचा नेमका विसर पडलाय..आम्हीच
शिवसेना हा त्यांचा फुगा फुटला. जाहिरातीत शिवसेना प्रमुख बालासाहेब ठाकरे यांचा फोटो टाकायला यांची तंतरली.
मोदी शहांचे इतके… pic.twitter.com/owsumBeN12

— Sanjay Raut (@rautsanjay61) June 13, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Devendra Fadnavis
  • eknath shinde
  • Maharashtra
  • PM Modi

తాజావార్తలు

  • RR Captain 2026: రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యాజమాన్యం.. కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్‌, నిజమేనా?

  • Medchal: కన్న తల్లిని కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన కుమార్తె.. ఏడాది తర్వాత బయటపడ్డ నిజం!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • LPG Booking Rules 2026: LPG బుకింగ్‌ టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

  • Gautham Menon: డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టు కథ చెప్పిన స్టార్ డైరెక్టర్.. షాకిచ్చిన హైకోర్టు!

ట్రెండింగ్‌

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions