Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
- డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీ కసరత్తు..
- మిషన్ 360ని ప్రారంభించిన కమలం పార్టీ..
- మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు పావులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation Bill: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘డీలిమిటేషన్’’ బిల్లును ఆమోదింపచేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. జూలై 20న ప్రారంభం కాబోయే సమావేశాలకు ముందే మద్దతు కూడగట్టేలా ప్లాన్ చేస్తోంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. 360 మంది ఎంపీల మద్దతును ఎన్డీయే సర్కార్ సాధించాల్సి ఉంది. అయితే, ఈ మెజారిటీ మార్కుకు 6 మంది సభ్యుల దూరంలో బీజేపీ ఉంది. ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే సర్కార్ ఈ బిల్లును ప్రవేశపెట్టినా మెజారిటీ సాధించడంలో విఫలమైంది.
ప్రస్తుతం మోడీ సర్కార్ ‘‘మిషన్ 360’’ని ప్రారంభించింది. మోడీ ప్రభుత్వం జూలై 19న ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, వర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ వరసగా సమావేశాలు నిర్వహిస్తోంది. గత వారం రోజులుగా బీజేపీ నాయకత్వం పలు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో కూడా ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్ హాజరయ్యారు.
Also Read
- Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
సంఖ్యాబలం లెక్క ఇదే..
లోక్సభలో మొత్తం 543 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలంటే 360 ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీయేకు గత ఎప్రిల్ నెలలో 298 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. స్వయంగా ఎన్డీయే సర్కార్కు 293 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు, టీఎంసీ రెబెల్ ఎంపీలు 20 మంది, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు పొందగలిగితే డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం అవుతుంది. ఈ రెండు పార్టీలు కూడా మద్దతు ఇస్తాయనే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఇటీవల షిండే శివసేనలో చేరారు. శరద్ పవార్కు చెందిన 8 మంది ఎంపీలు కూడా మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల సుప్రియా సూలే వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తు్న్నాయి. ఇక ఉద్ధవ్ పార్టీకి మిగిలిన ముగ్గురు ఎంపీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. అవసరమైన సవరణలు చేస్తే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. దీంతో 360 ఫిగర్కు మరో ముగ్గురు ఎంపీల దూరంలో ఉంది.
ఇదిలా ఉంటే, ఎంపీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ నాయకత్వం చురుకుగా పనిచేస్తోంది. హోంమంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లో భేటీ అయ్యారు. మరోవైపు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలతో విడివిడిగా సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!