Mobiles Ban In School: స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ నిషేధం.. ఉత్తర్వులిచ్చిన ఢిల్లీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobiles Ban In School: ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంత మందికి స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి ఇంటి దగ్గర ఉండే గృహుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్ లేకపోతే ఏదో వెళితిగా భావించే వారు ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే స్కూల్కి వెళ్లే పిల్లలు తమ బ్యాగులో మొబైల్ తీసుకెళ్లి ఖాళీ సమయంలో చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ ను నిషేధిస్తూ ఢిల్లీ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఢిల్లీ స్కూళ్లల్లో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా మొబైల్ ఫోన్ల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
Read also: Bangladesh Captain: బంగ్లాదేశ్ కెప్టెన్గా.. మళ్లీ మాజీనే
Also Read
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
మొబైల్ ఫోన్ల నిషేధంపై ఢిల్లీ సర్కార్ క నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, ప్లే గ్రౌండ్స్తోపాటు పాఠశాల పరిధిలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ గురువారం ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లు వాడరాదని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని విద్యశాఖ సూచించింది. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో 17 ఏండ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ అరెస్టయిన నేపథ్యంలో స్కూల్ ఆవరణల్లో మొబైల్ ఫోన్లు వాడొద్దని ఆదేశాలివ్వాలని అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ, ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి. ఆ విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ హిమాంశు గుప్తా తెలిపారు. స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసినందుకు ఢిల్లీ విద్యాశాఖ డైరెక్టరేట్కు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ అధ్యక్షుడు భరత్ అరోరా ధన్యవాదాలు తెలిపారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లను ఇవ్వరాదని.. ఒక వేళ విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చినా.. సురక్షితంగా నిల్వ చేసేందుకు లాకర్లను ఏర్పాటు చేయాలని స్కూళ్ల యాజమాన్యాలకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
- Tags
- Ban
- delhi govt
- mobiles
- Ordered
- Schools
తాజావార్తలు
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!