Seethakka: శాంతి భద్రతలు దిగజారుతున్నా.. సీఎం ఫార్మ్ హౌజ్ లోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫార్మ్ హౌజ్ కే పరిమితం అవుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కార్యక్రమానికి హాజరైన సీతక్క టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ అటవీ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి పట్టాలు ఇస్తే నేడు ఆ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. స్థానిక సమస్యలను పట్టించుకోకుడా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు పలుకుతూ టైంను కేటాయిస్తున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు మూడెకరాల భూమి లేదు.. ప్రభుత్వ ఉద్యోగాలు లేవని విమర్శిచారు. పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్రం ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటుందని ఆరోపించారు. పబ్ లు, క్లబ్ లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా.. ప్రభుత్వం నిద్ర పోతుందని ఆరోపించారు. సాక్షాత్తు ప్రభుత్వ వాహనాల్లో అత్యాచారం చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. హైదరాబాద్ లో అత్యాచార ఘటన జరిగి పదిరోజులు దాటినా ఇప్పటి వరకు అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా దాచి పెడుతున్నారని విమర్శించారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ప్రజలకు భద్రత కల్పించే విషయంలో కాకుండా ప్రతిపక్షాలపై నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ వచ్చాక రోడ్ పై మర్దర్లు, పరువు హత్యలు జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్ అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయకుండా, దోషులను శిక్షించకుండా తప్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీస విచారణ లేకుండా నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందటం టీఆర్ఎస్, బీజేపీలకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అందరి హక్కులను కాపాడేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..