Tamil Nadu: తమిళనాట ఖరారైన డీఎంకే పొత్తు.. స్టాలిన్తో మిత్రపక్షాలు భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో అధికార డీఎంకేతో మిత్రపక్షాల సీట్ల ఒప్పందం దాదాపుగా ఖరారైంది. మిత్రపక్షాలైన వీసీకే, ఎండీఎంకేలతో సీట్ల సర్దుబాటు పూర్తైంది. రెండు పార్టీలతో 2019 ఒప్పందాన్ని మళ్లీ పునారవృతం చేశారు. విడుతలై చిరుతైగల్ కట్చి (విసికె)కి రెండు సీట్లు కేటాయించగా, ఈ రెండు కూడా రిజర్వ్డ్ సీట్లు. వైకో నాయకత్వంలోని ఎండీఎంకేకు ఒక సీటును కేటాయించారు. దీంతో పాటు 2019లో ఈ పార్టీకి ఒక రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు.
Read Also: Congress: ‘యువ న్యాయ్’ పేరుతో యువతకు కాంగ్రెస్ 5 హమీలు..
Also Read
- Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
సీట్ల షేరింగ్ విషయమై డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్తో వీసీకే, ఎండీఎంకే అధ్యక్షులు థోల్ తిరుమావళవన్, వైకో సీట్ల షేరింగ్పై సంతకాలు చేశారు. చిదంబరం, విల్లుపురం ఎంపీ స్థానాల నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని వీకేసీ చీఫ్ తిరుమావళవన్ అన్నారు. ఈయన గతంలో చిదంబరం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. అయితే, ఈ సారి పార్టీ ఒక జనరల్ సీటులో పాటు 3 స్థానాల్ని కోరిందని, అయితే తమిళనాడు, భారత రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, ఈసారి డీఎంకేని గెలిపించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు సీట్లు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. తమ పార్టీ కర్ణాటక, కేరళ, తెలంగాణలోని 15 స్థానాల నుంచి అభ్యర్థుల్ని బరిలోకి దింపుతుందని వెల్లడించారు.
సీట్ల పంపకం కుదిరిందని ఎండీఎంకే చీఫ్ వైకో తెలిపారు. డీఎంకే ఇప్పటికే వీసీకే, ఎండీఎంకేతో పాటు మిత్రపక్షాలైన సీపీఐ (ఎం), సీపీఐ, ఐయూఎంఎల్, కేఎండీకేలతో సీట్ల పంపకాల ఒప్పందాలను ఖరారు చేసుకుంది. కాంగ్రెస్తో ఇంకా ఒప్పందం కుదరలేదు. తమిళనాడులో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్(ఎస్పీఏ)కి డీఎంకే నాయకత్వం వహిస్తోంది. 2019 ఎన్నికల్లలో పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాల్లో 38 స్థానాల్ని డీఎంకే కూటమి గెలుచుకుంది.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!