Lakhimpur Kheri Case: యూపీ రైతుల హత్య కేసులో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakhimpur Kheri Case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించి, రాజకీయ దుమారానికి కారణం అయిన లఖీంపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు 8 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్ను తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఆశిష్ మిశ్రా సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే తప్పా నిందితుడిని నిరవధికంగా జైలులో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Read Also: Pathan Movie Row: సినిమా నడిపితే థియేటర్లని తగలబెడతాం.. బీహార్లో హిందూ సంస్థల ఆగ్రహం
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
బెయిల్ ఇచ్చే సందర్భంలో పలు కండిషన్లను పెట్టింది సుప్రీంకోర్టు. మిశ్రా విడుదలైన వారంలోపు ఉత్తర్ ప్రదేశ్ ను విడిచిపెట్టాలని, యూపీ, ఢిల్లీల్లో ఎక్కడా ఉండకూడని, మిశ్రా ఎక్కడ ఉన్నాడో కోర్టుకు తెలియపరచాలని, సాక్షిని ప్రభావితం చేసేందుకు ఆశిష్ మిశ్రా, అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. బెయిల్ రద్దు చేస్తామని తెలిపింది. మేము మా స్వయంప్రతిపత్తి అధికారాలను ఉపయోగించడం ద్వారా ఇతర నలుగుర సహ నిందితులకు కూడా మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం వెల్లడించింది. మిశ్రా ఎక్కడ ఉంటాడో తన లోకేషన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించింది.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. 2021లో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కారుతో రైతుల పైకి వేగంగా పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, కార్ డ్రైవర్, ఓ జర్నలిస్ట్ మరణించారు. ఈ ఘటనలో ఆశిష్ మిశ్రాతో పాటు మొత్తం 12 మందిపై హత్య, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు అయ్యాయి.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!