MadhyaPradesh: నదిలో పడిన మినీ ట్రక్కు.. 12 మంది దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MadhyaPradesh: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. అదపు తప్పిన మినీ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరి కొంత మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వారంతా మినీ ట్రక్కులో వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా బుహ్రలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లోని దతియా వద్ద ఎల్ మినీ ట్రక్ నదిలో పడిపోయింది. మినీ లారీలో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఐదుగురి మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన వారు గల్లంతయ్యారు. దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుహ్ర గ్రామంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు వంతెన దాటుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ట్రక్కులో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. గ్వాలియర్లోని భేలేటి గ్రామం నుంచి తికమ్గఢ్లోని జాతర గ్రామానికి పెళ్లి కోసం వెళ్తున్నారు.
Read also: CM YS Jagan: నాలుగేళ్లలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తెచ్చాం..
Also Read
- UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
- UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
- India’s Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు? FAS నివేదికలో సంచలన వివరాలు
- CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్పై స్టాలిన్ విమర్శలు
మినీ ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. బుహ్రా నదిలో ట్రక్కు పడిపోయిందనే సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని ట్రక్కులోని వారిని రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. గ్రామస్తులు అధికార యంత్రాంగానికి సైతం సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని.. ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతుందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read also: Vijay- Hatya: విజయ్ ఆంటోనీ ‘హత్య’ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు
ఈ ఘటనపై హోంమంత్రి నరోత్తం మిశ్రా విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ,ఖాటిక్ కమ్యూనిటీ ప్రజలు బలేహరి నివాసితులు. జాతర (తికమ్ఘర్) తన కూతురి పెళ్లికి మినీ ట్రక్కులో వెళ్తున్నారు. బుహ్ర నది వంతెన దాటుతుండగా ట్రక్కు చక్రం తెగిపోవడంతో ట్రక్కు నదిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు 5 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 65 ఏళ్ల మహిళ కూడా ఉంది. 18 ఏళ్ల యువకుడితోపాటు.. రెండు, మూడు సంవత్సరాల పిల్లలున్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 5 మంది మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?