MadhyaPradesh: నదిలో పడిన మినీ ట్రక్కు.. 12 మంది దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MadhyaPradesh: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. అదపు తప్పిన మినీ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరి కొంత మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వారంతా మినీ ట్రక్కులో వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా బుహ్రలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లోని దతియా వద్ద ఎల్ మినీ ట్రక్ నదిలో పడిపోయింది. మినీ లారీలో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఐదుగురి మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన వారు గల్లంతయ్యారు. దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుహ్ర గ్రామంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు వంతెన దాటుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ట్రక్కులో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. గ్వాలియర్లోని భేలేటి గ్రామం నుంచి తికమ్గఢ్లోని జాతర గ్రామానికి పెళ్లి కోసం వెళ్తున్నారు.
Read also: CM YS Jagan: నాలుగేళ్లలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తెచ్చాం..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
మినీ ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. బుహ్రా నదిలో ట్రక్కు పడిపోయిందనే సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని ట్రక్కులోని వారిని రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. గ్రామస్తులు అధికార యంత్రాంగానికి సైతం సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని.. ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతుందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read also: Vijay- Hatya: విజయ్ ఆంటోనీ ‘హత్య’ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు
ఈ ఘటనపై హోంమంత్రి నరోత్తం మిశ్రా విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ,ఖాటిక్ కమ్యూనిటీ ప్రజలు బలేహరి నివాసితులు. జాతర (తికమ్ఘర్) తన కూతురి పెళ్లికి మినీ ట్రక్కులో వెళ్తున్నారు. బుహ్ర నది వంతెన దాటుతుండగా ట్రక్కు చక్రం తెగిపోవడంతో ట్రక్కు నదిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు 5 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 65 ఏళ్ల మహిళ కూడా ఉంది. 18 ఏళ్ల యువకుడితోపాటు.. రెండు, మూడు సంవత్సరాల పిల్లలున్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 5 మంది మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!