MadhyaPradesh: నదిలో పడిన మినీ ట్రక్కు.. 12 మంది దుర్మరణం..
MadhyaPradesh: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. అదపు తప్పిన మినీ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరి కొంత మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వారంతా మినీ ట్రక్కులో వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా బుహ్రలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లోని దతియా వద్ద ఎల్ మినీ ట్రక్ నదిలో పడిపోయింది. మినీ లారీలో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఐదుగురి మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన వారు గల్లంతయ్యారు. దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుహ్ర గ్రామంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు వంతెన దాటుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ట్రక్కులో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. గ్వాలియర్లోని భేలేటి గ్రామం నుంచి తికమ్గఢ్లోని జాతర గ్రామానికి పెళ్లి కోసం వెళ్తున్నారు.
Read also: CM YS Jagan: నాలుగేళ్లలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తెచ్చాం..
Also Read
మినీ ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. బుహ్రా నదిలో ట్రక్కు పడిపోయిందనే సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని ట్రక్కులోని వారిని రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. గ్రామస్తులు అధికార యంత్రాంగానికి సైతం సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని.. ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతుందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read also: Vijay- Hatya: విజయ్ ఆంటోనీ ‘హత్య’ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు
ఈ ఘటనపై హోంమంత్రి నరోత్తం మిశ్రా విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ,ఖాటిక్ కమ్యూనిటీ ప్రజలు బలేహరి నివాసితులు. జాతర (తికమ్ఘర్) తన కూతురి పెళ్లికి మినీ ట్రక్కులో వెళ్తున్నారు. బుహ్ర నది వంతెన దాటుతుండగా ట్రక్కు చక్రం తెగిపోవడంతో ట్రక్కు నదిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు 5 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 65 ఏళ్ల మహిళ కూడా ఉంది. 18 ఏళ్ల యువకుడితోపాటు.. రెండు, మూడు సంవత్సరాల పిల్లలున్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 5 మంది మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో