Milkipur Bypoll: అయోధ్యలో అప్పుడు ఓడింది.. ఇప్పుడు విజయం దిశగా బీజేపీ..
- మిల్కిపూర్ బై ఎలక్షన్లో బీజేపీ ఆధిక్యం..
- అయోధ్య రామమందిరం ఉన్నది ఇక్కడే..
- లోక్సభలో ఓటమి, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లీడ్..
Milkipur Bypoll: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్ ప్రదేశ్ మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఉంది. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలోనే అయోధ్య రామమందిరం ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) నేత అవధేశ్ ప్రసాద్ గెలుపొందారు. రామమందిర నిర్మాణం జరిగిన కొన్ని నెలల తర్వాత బీజేపీ ఓడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read Also: Congress: దశాబ్ధాల చరిత్ర ఉన్నా.. దేశ రాజధానిలో పత్తాలేని కాంగ్రెస్..
Also Read
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
ఇదిలా ఉంటే, అవధేశ్ ప్రసాద్ ఎంపీగా గెలవడంతో మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. శనివారం ఓట్ల లెక్కింపులో బీజేపీ ఈ స్థానంలో విజయం దిశగా కొనసాగుతోంది. అయోధ్యలో ఈ సారి ఎలాగైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే మిల్కీపూర్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మిల్కిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ నుంచి అజిత్ ప్రాదస్, బీజేపీ నుంచి చంద్రభాను పాస్వాన్ పోటీలో ఉన్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. మిల్కిపూర్లో బీజేపీ అభ్యర్థి హవా కొనసాగుతోంది. చంద్రభాను పాస్వాన్ ఏకంగా 10,000 కన్నా అధిక ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 5న మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 3.70 లక్షల మంది ఓటర్లలో 65 శాతం కంటే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని అధిగమించింది.
తాజావార్తలు
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో