G20 Speakers Meet: అక్టోబర్ 12 నుంచి జీ20 పార్లమెంట్ స్పీకర్ల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Speakers Meet: ఈ నెల 8 నుంచి 10 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జీ-20 దేశాల సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10 వరకు మూడు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు సైతం సెలవులు ప్రకటించారు. జీ-20 దేశాల సమావేశాల అనంతరం మరో అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించడానికి కేంద్రం సిద్ధమయింది. అదే పీ-20 పార్లమెంట్ స్పీకర్ల సమావేశం. జీ-20 కూటమి దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమావేశం వచ్చే నెలలో ఢిల్లీలో జరగనుంది. అక్టోబర్ 12, 13, 14వ తేదీల్లో పార్లమెంట్ నూతన భవనం పీ–20 పార్లమెంట్ స్పీకర్ల భేటీకి వేదిక కానుందని జీ20 ఇండియా స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొని చర్చలు జరుపుతారని తెలిపారు.
Read Also: Software Deepthi: సాఫ్ట్వేర్ దీప్తి కేసు.. అదుపులో చెల్లి చందన, ఆమె ప్రియుడు
Also Read
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
“ఇది అన్ని G20 దేశాలు మరియు ఆహ్వానిత దేశాల నుండి పార్లమెంటు స్పీకర్లు మరియు ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించిన సమావేశం. ఇది అక్టోబర్ 12 మరియు 14 మధ్య కొత్త పార్లమెంటు భవనంలో జరుగుతుంది” అని ఆయన చెప్పారు. “ప్రజాస్వామ్యానికి తల్లిగా భారతదేశం ప్రధాన కథనాల్లో ఒకటి. కాబట్టి, ఆ రోజుల్లో ఢిల్లీలో పార్లమెంటు స్పీకర్లు దిగినప్పుడు, మా చర్చల ద్వారా కీలక సందేశం రూపొందించనున్నామని.. దానిని బహిర్గతపరుస్తామని పరదేశి అన్నారు.‘పార్లమెంటేరియన్లు సంబంధిత ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కాబట్టి, పీ20 సమావేశాలు ప్రపంచ పాలనకు పార్లమెంటరీ కోణాన్ని తీసుకురావడం, అవగాహన పెంచడం, అంతర్జాతీయ నిబంధనలకు రాజకీయ మద్దతును సాధించడం, వీటిని సమర్థంగా కార్యరూపం దాల్చేలా చేయడమే ఈ సమావేశాల లక్ష్యం’అనిముక్తేశ్ వివరించారు. భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లిగా చూపేందుకు ఉద్దేశించిన ఒక ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. 2010లో జీ20 అధ్యక్ష స్థానంలో కెనడా ఉన్నప్పటి నుంచి పీ20 గ్రూప్ భేటీలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన .. ఆ క్రమంలో ఇది 9వ సమావేశం అని తెలిపారు.
తాజావార్తలు
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!