Meerut Murder: ‘‘నాన్న డ్రమ్లో ఉన్నాడు’’.. తండ్రి హత్య గురించి పక్కింటి వాళ్లకు చెప్పిన పాప..
- ‘‘నాన్న డ్రమ్లో ఉన్నాడు’’..
- సౌరభ్ రాజ్పుత్ హత్యని చూసిన ఆరేళ్ల కూతురు..
- మీరట్ మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్య కేసులో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Murder: మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య ముస్కాన్ రస్తోగి, తన లవర్ సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసింది. శవాన్ని 15 ముక్కలుగా నరికి, డ్రమ్ములో వేసి, సిమెంట్తో కప్పేసింది. మార్చి 04న జరిగిన ఈ హత్య, సౌరభ్ మిస్సింగ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వేరే దేశంలో పనిచేస్తున్న సౌరభ్, తన 6 ఏళ్ల కూతురు పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన తర్వాత, పక్కా ప్లాన్లో భార్య, ఆమె లవర్ కలిసి హత్య చేశారు.
Read Also: AP Legislative Council: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని పీపీపీ మోడ్లో నిర్మిస్తాం!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
అయితే, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 04న ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చిన తర్వాత ముస్కాన్, సాహిల్ ఇద్దరు కలిసి సౌరభ్ని కొత్తితో పొడిచి హత్య చేశారు. మత్తులోకి జారుకున్న తర్వాత తన ప్రియుడు సాహిల్ని పిలిచి, గొంతు కోసి, గుండెల్లో పొడిచి చంపేశారు. మృతదేహాన్ని సులభంగా మాయం చేయడానికి సాహిల్ సౌరభ్ చేతులు నరికేశాడు. తర్వాతి రోజు ఉదయం కొత్త డ్రమ్ కొనుక్కుని వచ్చి, సిమెంట్, ఇసుక కొని, సౌరభ్ శరీర భాగాలను డ్రమ్లో వేసి కప్పేశారు.
అయితే, ఈ కేసులో మరో విషయం విచారణలో తెలిసింది. ఈ హత్యను ఆరేళ్ల కుమార్తె చూసినట్లు తెలుస్తోంది. ‘‘నాన్న డ్రమ్లో ఉన్నాడు’’అని పొరుగు వారికి పదేపదే చెప్పేదని సౌరభ్ తల్లి రేణు దేవి చెప్పింది. హత్య గురించి చిన్నారికి తెలుసని చెప్పింది. ఈ కేసులో ముస్కాన్, సాహిల్ డ్రగ్స్కి బానిసైనట్లు తెలుస్తోంది. 2016లో పెద్దలను ఎదురించి ముస్కాన్, సౌరభ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సాహిల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ కుమార్తెను సౌరభ్ గుడ్డిగా ప్రేమించాడని, తన కూతురుకు బతికే హక్కు లేదని, ఆమెను ఉరితీయాలని ముస్కాన్ తల్లిదండ్రులు కోరారు. ఈ విషయంలో తాము సౌరభ్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!