Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Massive Scam Under Madhya Pradesh Chief Ministers Watch Finds Auditor

Madhyapradesh: మధ్యప్రదేశ్‌ సీఎం కనుసన్నల్లో భారీ స్కాం.. పిల్లల ఆహార పథకంలో గోల్‌మాల్‌!

Published Date :September 4, 2022 , 9:19 pm
By Mahesh Jakki
Madhyapradesh: మధ్యప్రదేశ్‌ సీఎం కనుసన్నల్లో భారీ స్కాం.. పిల్లల ఆహార పథకంలో గోల్‌మాల్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Madhyapradesh: మధ్యప్రదేశ్ సర్కారు చేపట్టిన పోషకాహార పథకంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్కూల్‌ పిల్లల ఆహార పథకంలో భారీగా గోల్‌మాల్‌ జరిగింది. సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ పర్యవేక్షణలో ఉన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్‌ అకౌంటెంట్ జనరల్ గుర్తించింది. రేషన్‌ సరుకులను తరలించేందుకు వినియోగించిన ట్రక్కుల నంబర్లు బైకులుగా తేలటం నుంచి.. లబ్ధిదారుల వాస్తవానికి దూరంగా ఉండటం వరకు భారీ స్థాయిలో అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంతో చిన్నారులు, మహిళలు పోషకాహారలోపానికి గురికావటంతో పాటు పన్ను చెల్లింపుదారుల కోట్లాది రూపాయలు అవినీతిపరుల చేతిలోకి వెళ్లినట్లు రాష్ట్ర ఆడిటర్‌ గుర్తించారు.

పాఠశాల చిన్నారులకు ఉచిత ఆహారం పథకంలో అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ రూపొందించిన 36 పేజీల నివేదికలోని పలు అంశాలు బయటకు రావటం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోంది. పిల్లలు, మహిళల పౌష్ఠికాహారం కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టేక్‌ హోం రేషన్‌ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు అందులో పేర్కొంది. 2021కి సంబంధించిన టేక్ హోమ్ రేషన్ పథకంలో దాదాపు 24 శాతం మంది లబ్ధిదారుల వివరాలను పరిశీలించినట్లు నివేదిక తెలిపింది. ఈ పథకం ద్వారా 34.69 లక్షల మంది 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 14.25 లక్షల గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు, 0.64 లక్షల మంది పాఠశాల మానేసిన బాలికలకు పోషకాహారం అందించారు.

పోషకాహార పథకంలో భాగంగా వివిధ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి సుమారు 1,125.64 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ సరుకులను సరఫరా చేశారు. రవాణా కోసం ట్రక్కులకు రూ.6.94 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ట్రక్కులుగా లెక్కలో చూపిన వాహనాలు బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్లుగా రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నాయి. దీంతో సరుకుల రవాణాలోనే కోట్లాది రూపాయలు దారిమళ్లినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఆడిట్‌ నివేదిక ప్రకారం స్కూల్‌ పిల్లలకు ఉచిత ఆహార పంపిణీ పథకంలో లబ్ధిదారుల సంఖ్య, ఆహారం ఉత్పత్తి, నాణ్యత, పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయి. 2018లో కేవలం 9 వేలు ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2021 నాటికి ఏకంగా 36.08 లక్షలకు పెరిగింది. ఉచిత రేషన్‌కు అర్హులైన స్కూల్‌ బాలికలను 2018 ఏప్రిల్‌ నాటికి గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినా ఆ రాష్ట్ర మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) పట్టించుకోలేదు. 2018-19లో అర్హులైన 11-14 ఏళ్ల బాలికల సంఖ్య 9,000గా ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. అయితే ఎలాంటి సర్వే నిర్వహించకుండానే లబ్ధిదారుల సంఖ్య 36.08 లక్షలుగా మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ పేర్కొంది.

JDU: 2024 ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లే.. ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికే..

కాగా, 8 జిల్లాల పరిధిలోని 49 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆడిట్‌ నిర్వహించగా కేవలం మూడు జిల్లాలోనే రేషన్‌ పొందుతున్న స్కూల్‌ బాలికల నమోదును గుర్తించారు. అయితే 2018-21లో 63,748 మంది బాలికలను జాబితాలో చేర్చి 29,102 మందికి సహాయం చేసినట్లుగా డబ్ల్యూసీడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో డాటా మానిప్యులేషన్‌ ద్వారా రూ.110.83 కోట్ల విలువైన రేషన్ పక్కదారి పట్టినట్లు ఆడిట్‌లో తేలింది. అలాగే రేషన్‌ ఉత్పత్తిలో రూ.58 కోట్ల మేర అవినీతి జరిగినట్లు వెలుగుచూసింది. రూ.62.72 కోట్ల విలువైన 10,000 మెట్రిక్ టన్నులకుపైగా రేషన్‌ సరుకులు అసలు రవాణా కాలేదు. గోదాముల్లో కూడా లేని ఈ సరుకులు మాయం అయినట్లు బయటపడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • audit report
  • Madhya Pradesh Accountant General
  • Madhyapradesh
  • Massive Scam
  • Nutrition

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions