Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- భారత్ టూర్కు మార్కో రూబియో
- రేపటి నుంచి 3 రోజుల పాటు పర్యటన
- వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పర్యటనకు రాబోతున్నారు. ప్రస్తుతం స్వీడన్లో పర్యటిస్తున్న ఆయన.. రేపటి నుంచి భారతదేశంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే పర్యటనకు ముందు రూబియో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. అనూహ్యంగా వెనిజులా అంశాన్ని ప్రస్తావించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారత్తో ఇంధన సహకారాన్ని మరింత విస్తరించాలన్న లక్ష్యంతో అమెరికా ముందుకెళ్తున్న నేపథ్యంలో వెనిజులా నుంచి కూడా భారత్కు చమురు సరఫరాలపై కూడా చర్చలు జరుగుతున్నాయని రూబియో వెల్లడించారు.
“భారత్కు ఎంత ఇంధనం అవసరమైతే అంత సరఫరా చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అమెరికా చరిత్రలోనే అత్యధిక స్థాయిలో చమురు ఉత్పత్తి, ఎగుమతులు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. భారత్ ఇంధన అవసరాల్లో అమెరికా మరింత కీలక భాగస్వామిగా మారాలని ఆశిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ వచ్చే వారం భారత్ పర్యటనకు రావచ్చని కూడా రూబియో వెల్లడించారు. ఈ ప్రకటనను భారత్ లేదా వెనిజులా అధికారికంగా ప్రకటించేలోపే అమెరికా విదేశాంగ కార్యదర్శి వెల్లడించడం దౌత్య వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
వెనిజులా చమురు కొనుగోళ్లపై భారత్తో అమెరికా చర్చలు జరుపుతోందని.. ఇది రష్యా చమురుపై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మే 23 నుంచి 26 వరకు భారత్లో పర్యటించనున్న మార్కో రూబియో కోల్కతా, న్యూఢిల్లీ, ఆగ్రా, జైపూర్ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా పాల్గొననున్నారు. భారత్ను “మంచి మిత్రదేశం.. గొప్ప భాగస్వామి”గా రూబియో అభివర్ణించారు.. ఇంధనం, రక్షణ, వాణిజ్య రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!