Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- భారత్ టూర్కు మార్కో రూబియో
- రేపటి నుంచి 3 రోజుల పాటు పర్యటన
- వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పర్యటనకు రాబోతున్నారు. ప్రస్తుతం స్వీడన్లో పర్యటిస్తున్న ఆయన.. రేపటి నుంచి భారతదేశంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే పర్యటనకు ముందు రూబియో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. అనూహ్యంగా వెనిజులా అంశాన్ని ప్రస్తావించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారత్తో ఇంధన సహకారాన్ని మరింత విస్తరించాలన్న లక్ష్యంతో అమెరికా ముందుకెళ్తున్న నేపథ్యంలో వెనిజులా నుంచి కూడా భారత్కు చమురు సరఫరాలపై కూడా చర్చలు జరుగుతున్నాయని రూబియో వెల్లడించారు.
“భారత్కు ఎంత ఇంధనం అవసరమైతే అంత సరఫరా చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అమెరికా చరిత్రలోనే అత్యధిక స్థాయిలో చమురు ఉత్పత్తి, ఎగుమతులు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. భారత్ ఇంధన అవసరాల్లో అమెరికా మరింత కీలక భాగస్వామిగా మారాలని ఆశిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ వచ్చే వారం భారత్ పర్యటనకు రావచ్చని కూడా రూబియో వెల్లడించారు. ఈ ప్రకటనను భారత్ లేదా వెనిజులా అధికారికంగా ప్రకటించేలోపే అమెరికా విదేశాంగ కార్యదర్శి వెల్లడించడం దౌత్య వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
వెనిజులా చమురు కొనుగోళ్లపై భారత్తో అమెరికా చర్చలు జరుపుతోందని.. ఇది రష్యా చమురుపై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మే 23 నుంచి 26 వరకు భారత్లో పర్యటించనున్న మార్కో రూబియో కోల్కతా, న్యూఢిల్లీ, ఆగ్రా, జైపూర్ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా పాల్గొననున్నారు. భారత్ను “మంచి మిత్రదేశం.. గొప్ప భాగస్వామి”గా రూబియో అభివర్ణించారు.. ఇంధనం, రక్షణ, వాణిజ్య రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!