Maoists: 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ.. సారాంశం ఇదే!
- 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ
- మూడు జోనల్కు ప్రతినిధిగా ఉన్న అనంత్ అభ్యర్థన లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని మావోయిస్టులను మాత్రం భద్రతా దళాలు అంతమొందిస్తున్నాయి. మార్చి నెల నాటికి మావో రహిత దేశంగా మార్చాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో మావోల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు చెందిన మావోయిస్ట్ కమిటీ ప్రభుత్వాలకు లేఖ రాసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు లేఖలు రాసింది. మూడు జోనల్కు ప్రతినిధిగా ఉన్న అనంత్ అభ్యర్థన లేఖ రాశాడు.
లేఖ సారాంశం ఇదే..
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని.. ప్రభుత్వ పునరావాసం పథకంలో చేరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే లొంగిపోవడానికి మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరాడు. తమ పార్టీ ప్రజాస్వామ్య కేంద్రకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని.. సమిష్టి నిర్ణయానికి కొంత సమయం పడుతుందని.. సహచరులను సంప్రదించి సందేశం తెలియజేసేంత వరకు తమకు సమయం ఇవ్వాలని కోరాడు.
ఇది కూడా చదవండి: Supreme Court: సీజేఐగా సూర్య కాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన మోడీ
మావోయిజాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు మార్చి 31, 2026 లోపు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇకపై ఎలాంటి వారోత్సవాలు జరుపుకోబోమని.. ప్రస్తుతం ఆ కార్యక్రమాలన్నీ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నాడు. లేఖ అందిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆహ్లాదకరంగా.. సానుకూలంగా నిర్ణయాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపాడు. అలాగే మా సందేశం సహచరులకు త్వరగా అందేలా కొద్దిరోజులు రేడియోలో కూడా ప్రసారం చేయాలని అభ్యర్థించాడు. సమాచారం చేరడానికి తమకు ఏకైక మార్గం ఒక్క రేడియోనేనని పేర్కొన్నాడు. అలాగే ప్రజా ప్రతినిధులను, జర్నలిస్టులను కూడా కలిసే అవకాశం కూడా ఇస్తారని భావిస్తున్నట్లు కోరాడు. సహచరులను సంప్రదించిన తర్వాత లొంగిపోయే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించాడు. సహచరులైన సోను దాదా, సతీష్ దాదాలకు సమాచారం అందేలా జర్నలిస్టులు మధ్యవర్తిత్వం వహించాలని కోరాడు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!