Maoist Ceasefire: 24 గంటల్లోనే ‘‘కాల్పుల విరమణ’’ ఉల్లంఘించిన మావోయిస్టులు, ఇద్దరి హత్య..
- కాల్పుల విరమణను ఉల్లంఘించిన మావోయిస్టులు..
- బీజాపూర్, దంతేవాడల్లో ఇద్దరి హత్య..
- శాంతి చర్చలకు, ఆయుధాల వదిలేసేందుకు సిద్ధం అని ప్రకటన..
- అంతలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో హింస..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Ceasefire: ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేసేందుకు వరసగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు పలు ఎన్కౌంటర్లలో కీలకమైన మావోయిస్టు లీడర్లను హతమార్చారు. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్కి కీలక విజయమని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ల నేపథ్యంలో మావోయిస్టులు ‘‘కాల్పుల విరమణ’’ను ప్రకటించారు. ఆయుధాలను వదిలేస్తామని కేంద్రానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
అయితే, ఈ కాల్పుల విరమణ హామీ 24 గంటల్లోనే విఫలమైంది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల్లో ఇద్దరు పౌరుల్ని దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్ 16-17 తేదీల్లో అర్థరాత్రి ఈ సంఘటనలు జరిగాయి. శాంతి చర్చల కోసం ఆయుధాలను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన మావోయిస్టులు, ఒక రోజులోనే ఈ హత్యలకు పాల్పడ్డారు.
Also Read
- PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
Read Also: Band Melam : కోర్టు జంట కొత్త మూవీ.. బూతులతో రెచ్చిపోయిన శ్రీదేవి..
బీజాపూర్ జిల్లాల్లోని భైరామ్గఢ్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు బెంచరం పంచాయతీ ఉప సర్పంచ్ దష్రు రామ్ ఓయంపై దాడి చేసి చంపేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇతడిని హత్య చేశారు. దంతేవాడ జిల్లాలో కూడా ఇలాంటి హత్యే జరిగింది. మలంగిర్ ఏరియా కమిటీ సభ్యులు నీలావాయ గ్రామానికి చెందిన బండి కొర్రామ్ను ఉరి తీసి చంపారు. ఇతడిని కూడా పోలీస్ ఇన్ఫార్మర్గా భావించే హత్య చేశారు.
ఈ హత్యలపై పోలీసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బస్తర్ ఏరియాలో భద్రతా కార్యకలాపాలు తీవ్రతరం అవుతాయని సీనియర్ పోలీస్ అధికారులు మీడియాతో చెప్పారు. ఈ హత్యలు మావోయిస్టుల నిజాయితీ లేనితనాన్ని చూపిస్తున్నాయని అన్నారు. మార్చి, 2026 నాటికి మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారు.
కాల్పుల విరమణకు సంబంధించి మావోయిస్టు కేంద్ర నాయకత్వం లేఖను విడుదల చేసింది. శాంతి చర్చలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. ఈ లేఖ విడుదలైన 24 గంటల్లోనే హత్యలకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!