Maoist Ceasefire: 24 గంటల్లోనే ‘‘కాల్పుల విరమణ’’ ఉల్లంఘించిన మావోయిస్టులు, ఇద్దరి హత్య..
- కాల్పుల విరమణను ఉల్లంఘించిన మావోయిస్టులు..
- బీజాపూర్, దంతేవాడల్లో ఇద్దరి హత్య..
- శాంతి చర్చలకు, ఆయుధాల వదిలేసేందుకు సిద్ధం అని ప్రకటన..
- అంతలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో హింస..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Ceasefire: ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేసేందుకు వరసగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు పలు ఎన్కౌంటర్లలో కీలకమైన మావోయిస్టు లీడర్లను హతమార్చారు. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్కి కీలక విజయమని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ల నేపథ్యంలో మావోయిస్టులు ‘‘కాల్పుల విరమణ’’ను ప్రకటించారు. ఆయుధాలను వదిలేస్తామని కేంద్రానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
అయితే, ఈ కాల్పుల విరమణ హామీ 24 గంటల్లోనే విఫలమైంది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల్లో ఇద్దరు పౌరుల్ని దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్ 16-17 తేదీల్లో అర్థరాత్రి ఈ సంఘటనలు జరిగాయి. శాంతి చర్చల కోసం ఆయుధాలను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన మావోయిస్టులు, ఒక రోజులోనే ఈ హత్యలకు పాల్పడ్డారు.
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
Read Also: Band Melam : కోర్టు జంట కొత్త మూవీ.. బూతులతో రెచ్చిపోయిన శ్రీదేవి..
బీజాపూర్ జిల్లాల్లోని భైరామ్గఢ్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు బెంచరం పంచాయతీ ఉప సర్పంచ్ దష్రు రామ్ ఓయంపై దాడి చేసి చంపేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇతడిని హత్య చేశారు. దంతేవాడ జిల్లాలో కూడా ఇలాంటి హత్యే జరిగింది. మలంగిర్ ఏరియా కమిటీ సభ్యులు నీలావాయ గ్రామానికి చెందిన బండి కొర్రామ్ను ఉరి తీసి చంపారు. ఇతడిని కూడా పోలీస్ ఇన్ఫార్మర్గా భావించే హత్య చేశారు.
ఈ హత్యలపై పోలీసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బస్తర్ ఏరియాలో భద్రతా కార్యకలాపాలు తీవ్రతరం అవుతాయని సీనియర్ పోలీస్ అధికారులు మీడియాతో చెప్పారు. ఈ హత్యలు మావోయిస్టుల నిజాయితీ లేనితనాన్ని చూపిస్తున్నాయని అన్నారు. మార్చి, 2026 నాటికి మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారు.
కాల్పుల విరమణకు సంబంధించి మావోయిస్టు కేంద్ర నాయకత్వం లేఖను విడుదల చేసింది. శాంతి చర్చలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. ఈ లేఖ విడుదలైన 24 గంటల్లోనే హత్యలకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!