Boeing: బోయింగ్ విమానాలపై ఎన్నో ఆరోపణలు.. పడిపోయిన షేర్లు..
- బోయింగ్ విమానాలపై ఎన్నో ఆరోపణలు..
- పలుమార్లు హెచ్చరించిన ఇంజనీర్లు..
- ఎయిర్ ఇండియా ప్రమాదంతో పడిపోయిన బోయింగ్ షేర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boeing: ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ కుప్పకూలింది. ప్రయాణికులు, సిబ్బందితో కలిపిన 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదం తర్వాత మరోసారి బోయింగ్ విమానాల భద్రతలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ భద్రత, నాణ్యత, నియంత్రణ సమస్యలపై మరోసారి వివాదం మొదలైంది.
ఫ్యూజ్లేజ్ షిమ్మింగ్, స్కిన్ సర్పేసింగ్ సమస్యలపై గతంలో పలువురు ఇంజనీర్లు ఆరోపణలు వ్యక్తం చేశారు. పలువురు విజిల్బ్లోయర్లు బోయింగ్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. విమానాల తయారీలో షార్ట్కట్స్ల వైఫల్యాలపై హెచ్చరించారు 2020లో అనేక 787 విమానాలను ఫ్యూజ్లేజ్ షిమ్మింగ్ స్కిన్ సర్ఫేసింగ్ తో సహా నాణ్యత నియంత్రణల సమస్యల కారణంగా గ్రౌండింగ్ చేశారు.
Also Read
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
Read Also: Air India Plane Crash: ప్రమాద సమయంలో 80-90 టన్నుల ఇంధనం.. ‘‘ఫ్యూయల్ డంప్’’ సమయం కూడా లేదు..
బోయింగ్ ఇంజనీర్ సామ్ సలేహ్పూర్ 787, 777 రెండింటిలోనూ తయారీ షార్ట్కట్లు, సంభావ్య నిర్మాణ వైఫల్యాలపై వార్నింగ్ ఇచ్చారు. ఈ సమస్యలు విమానాల వయసు పెరుగుతున్న కొద్దీ ప్రమాదాలను తెచ్చిపెడుతాయని చెప్పారు. విజిల్బ్లోయర్ వాదనలపై FAA దర్యాప్తు కూడా చేసింది. ఫ్యూజ్లేజ్ విభాగాలను సరిగ్గా బిగించడం, విమాన మధ్యలో నిర్మాణ వైఫల్యాలను సంభావ్యతను పెంచే అవకాశం ఉంటుందనే ఆరోపణలపై FAA దర్యాప్తు చేసింది. తయారీ సమయంలో తీసుకున్న నిర్మాణ లోపాలు, షార్ట్కట్ల కారణంగా 787 ప్రమాదాలు జరుగొచ్చనే ఆందోళన ఎప్పటి నుంచో వ్యక్తం అవుతోంది. 787 నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఏరోస్పేస్ -గ్రేడ్ టైటానియం మిశ్రమం బదులుగా స్టాండర్డ్ టైటానియం వంటి పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఎఫ్ఏఏ గుర్తించింది.
ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రీ-మార్కెట్ ట్రేడింగ్లో బోయింగ్ కంపెనీ షేర్ల ధరలు 6.5 శాతం పడిపోయాయి. బారీ ప్రమాదాలు, టెక్నికల్ ఫెయిల్యూర్స్, వివాదాల వల్ల చాలా మంది బోయింగ్ షేర్లను అమ్మేశారు. గతంలోనూ పలు బోయింగ్ విమానాలు భారీ ప్రమాదాలను ఎదుర్కొన్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
-
Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
-
CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!