Pahalgam terror attack: పహల్గామ్ దాడిని సమర్థిస్తూ కర్ణాటక వ్యక్తి పోస్ట్.. కేసు నమోదు..
- పహల్గామ్ దాడిని సమర్థిస్తూ కర్ణాటక వ్యక్తి పోస్ట్..
- కేసు నమోదు, నిందితుడి కోసం గాలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనుపెట్టుకున్నారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన వారిని, మతం అడిగి హిందువులు అయితే కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ దాడిపై భారత్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే, పాకిస్తాన్పై దౌత్య యుద్ధం ప్రారంభించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు, పాక్తో సరిహద్దుల్ని మూసేసింది. పాక్ పౌరులు దేశం వదిలివెళ్లాలని హెచ్చరించింది.
Read Also: Pahalgam Terror Attack: పాక్ పాత్రపై విదేశీ రాయబారులకు ఆధారాలు చూపించిన భారత్
Also Read
ఓ వైపు భారతీయుల్ని చంపేశారని యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది నీచులు మాత్రం ఈ ఘటనను సమర్థిస్తూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు పాకిస్తాన్ తీరును సమర్థిస్తున్నారు. తాజాగా, పహల్గామ్ దాడిని సమర్థి్ంచినందుకు ‘నిచ్చు మంగళూరు’ అనే ఫేస్బుక్ వినియోగదారుపై కర్ణాటకలోని మంగళూరులో కేసు నమోదు చేయబడింది. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూర్కి చెందిన ఉల్లాల్ ప్రాంత వాసి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు నగరంలోని కోనాజే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో కంటెంట్ను ప్రచురించినందుకు, ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అశాంతిని ప్రేరేపించే లేదా హాని కలిగించే ప్రకటనలను ప్రసారం చేసినందుకు యూజర్పై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం, 2023లోని సెక్షన్లు 192 మరియు 353(1)(b) కింద అభియోగాలు మోపారు. ఈ పోస్టులో కాశ్మీర్లో జరిగిన హత్యల్ని 2023 పాల్ఘర్ రైల్వే స్టేషన్ కాల్పులతో పోల్చారు, ఈ ఘటనలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి సీనియర్ సహోద్యోగితో సహా నలుగురిని కాల్చి చంపారు. బాధితుల్ని కాల్చే ముందు వారు ముస్లింలేనా అని అధికారి అడిగారని, ఆ సమయంలో అతడిని ఉరితీసి ఉంటే, పహల్గామ్ సంఘటన జరిగేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రోఫైల్ పిక్లో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!