Manipur Violence: మణిపూర్లో మరోసారి హింసాకాండ.. ఒకరి మృతి, ఇళ్లు దగ్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మూడు వారాలుగా ఈ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. మైయిటీ, కుకీ జాతుల మధ్య ఘర్షణ క్రమంగా హింసాత్మక మారాయి. తాజాగా ఈ రోజు మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. తాజాగా బుధవారం చోటు చేసుకున్న హింసలో బుల్లెట్ గాయాలకు 29 ఏళ్ల యువకుడు మరణించాడు. వేరే వర్గానికి చెందిన వారు కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు గాయపడ్డారు.
ఈ సంఘటనల దృష్ట్యా, బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ మూడు జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును జిల్లా అధికారులు రద్దు చేశారు. గతంలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. బిష్ణుపూర్ జిల్లా మోయిరాంగ్లోని కొన్ని గ్రామాలపై సాయుధ యువకులు ఈరోజు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తోయిజం చంద్రమణి అనే వ్యక్తి బుల్లెట్ గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
Read Also: Meta Layoffs: మెటా మూడో రౌండ్ లేఆఫ్స్.. 5000 మంది ఉద్యోగాలు ఊస్ట్..
ఈ మరణంతో ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితిని నియంత్రించడానికి అదనపు పారామిలిటీరీ, పోలీస్ సిబ్బందిని మోహరించారు. మంగళవారం రాత్రి బిష్ణుపూర్ లోని ఫౌబక్చావోలో మూడు ఇళ్లను తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రతీకారంగా మరో వర్గానికి చెందిన యువకులు నాలుగు ఇళ్లను తగులబెట్టారు. మణిపూర్ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 11 జిల్లాల్లో హింసకు ప్రభావితం అయ్యాయి. మే 3 నుంచి రాష్ట్రంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ 11 జిల్లాల్లోని 23 అత్యంత సున్నితమైన మోహరించారు. మరిన్ని కేంద్ర బలగాలను పంపాల్సిందిగా సీఎం బీరెన్ సింగ్ కోరారు.
మెయిటీ కమ్యూనిటీకి గిరిజన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్న కుకీ, నాగా వంటి గిరిజన జాతులు నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’లో హింస చెలరేగింది. ఇది క్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపించింది. మణిపూర్ లో 53 శాతం మంది మెయిటీ కమ్యూనిటీ ఉన్నారు. ఈ హింసకాండ వల్ల ఇప్పటి వరకు 71 మంది మరణించారు. పోలీస్ సిబ్బందితో సహా 300 మంది గాయపడ్డారు. 1700 ఇళ్లు దగ్ధమయ్యాయి. 200 కన్నా ఎక్కువ వాహనాలకు నిప్పుపెట్టారు.
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!