ఉత్తరప్రదేశ్లోని బ్యూటీ పార్లర్లో వధువును కాల్చి చంపిన మాజీ ప్రేమికుడి కథ ముగిసింది. నిందితుడు దీపక్ మధ్యప్రదేశ్లో లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆవేశంలో ప్రియురాల్ని చంపి.. అరెస్ట్ భయంతో జీవితాన్ని ముగించేశాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఇది కూడా చదవండి: Viral Video: పార్లమెంట్లో కలిసిన హీరో హీరోయిన్లు.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలోని బార్గావ్ సోనాగిర్లో నివసిస్తున్న 26 ఏళ్ల దీపక్.. పొరిగింట్లో ఉండే కాజల్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అది కుదరక ఇంట్లో నుంచి ఇద్దరూ పారిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కాజల్ను తీసుకొచ్చి పేరెంట్స్కు అప్పగించారు. అనంతరం కాజల్ తల్లిదండ్రులు యూపీలోకి ఝాన్సీ ప్రాంతానికి చెందిన యువకుడితో ఈనెల 24న పెళ్లి నిశ్చయించారు. మరికొద్ది సేపట్లో పెళ్లి జరగబోతుందన్న సమయంలో మేకప్ కోసం కాజల్.. స్నేహితులతో కలిసి బ్యూటీ పార్లర్కు వెళ్లింది. ఆమెను వెంబడిస్తున్న మాజీ ప్రియుడు దీపక్.. బ్యూటీ పార్లర్కు వచ్చి తనతో వచ్చేయాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో కోపోద్రేకుడైన దీపక్.. కాజల్ను తుపాకీతో కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం దీపక్.. ఆగ్రా నుంచి ధర్మశాలలోకి వెళ్లిపోయాడు. ఆధార్, మొబైల్ నెంబర్ చెప్పి రూ.600లతో లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే అతడి జాడ కనుక్కున్న పోలీసులు.. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా గదిలో దీపక్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన చర్యలకు మనస్తాపం చెందే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఎంతో సంతోషంగా జీవితాలను సాగించాల్సినవాళ్లు అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోయాయి.
ఇది కూడా చదవండి: డైరెక్టర్ కేఎస్ రవికుమార్కి హీరోయిన్ కన్నా అందమైన కూతురు.. ఎప్పుడైనా చూశారా?