Maharashtra: దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాశాడంటే..!
- మహారాష్ట్రలో దారుణం
- భార్యను చంపి భర్త ఆత్మహత్య
- విముక్తి అంటూ సూసైడ్ నోట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో దారుణంగా జరిగింది. ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళీధర్ రామచంద్ర జోషి(80) తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య లత (76)ను చంపి.. అనంతరం జోషి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యకు ఉపశమనం లభించిందంటూ ఒక సూసైడ్ నోట్ను రాసి పెట్టాడు. ఈ విషాద సంఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని నాసిక్లో జోషి(80), భార్య లత (76) నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ముంబైలో స్థిరపడ్డారు. ఇక వృద్ధులను చూసుకోవడానికి కేర్ టేకర్ సీమా రాథోడ్ ఉంది. అయితే బుధవారం ఉదయం, మధ్యాహ్నం పని ముగించుకుని సీమా రాథోడ్ వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 7 గంటలకు వచ్చింది. వచ్చి చూసేటప్పటికీ ఇద్దరు చనిపోవడం చూసి షాక్ అయింది. సమాచారాన్ని పోలీసులకు తెలియజేసింది.
Also Read
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
ఇది కూడా చదవండి: Nagar Kurnool: నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం..
మృతదేహాలను పరిశీలించిన పోలీస్ అధికారులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు విముక్తి కలిగించి.. తాను కూడా విముక్తి పొందుతున్నట్లు లేఖలో జోషి పేర్కొన్నాడు. ‘‘నా భార్య లతను నేను చాలా ప్రేమిస్తున్నాను. ఆమె అనారోగ్యంతో విసిగిపోయి మంచం పట్టింది. నేను ఆమెను అనారోగ్యం నుంచి విడిపించాలనుకుంటున్నాను. నన్ను కూడా విడిపించుకుంటున్నాను.’’ అని నోట్లో ఉంది. అంతేకాకుండా గత నాలుగేళ్లుగా కేర్ టేకర్ రాథోడ్ ఎంతో సహాయం చేసిందని.. ఆమె సేవను ప్రశంసిస్తూ రూ.50 వేలు అందజేయాలని రాసి పెట్టి ఉంది. అలాగే భార్య లతకు అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు కొత్త చీర, మంగళసూత్రం, ఇతర ఆభరణాలతో అలంకరించాలని నోట్లో జోషి పేర్కొన్నారు. అంతేకాకుండా అంత్యక్రియలకు అవసరమైన డబ్బును కూడా ఉంచినట్లు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అప్నగర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Vontimitta Kalyanam 2025: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం.. కడప మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు!
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!