UP: పోలీసుల కర్కశత్వం.. ప్యాంట్పై సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య
- యూపీలో పోలీసుల కర్కశత్వం
- ప్యాంట్పై సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఇటీవల పోలీసుల దెబ్బలు తాళలేక సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. విపక్షాల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి.. పోలీసులను సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పింది. అదే తరహాలో యూపీలో కూడా ఒక వ్యక్తిని పోలీసులు చితకబాదారు. దీంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Kingdom : అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో రిలీజ్..
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ఫరూఖాబాద్లోని ఛేడా నాగ్లా ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. తన భర్త దిలీప్ రాజ్పుత్ తాగి వచ్చి తనను కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిలీప్ను పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు పిలిచారు. దిలీప్ తన తండ్రితో కలిసి స్టేషన్కు వచ్చాడు. అయితే కేసు రాజీ చేయడానికి రూ.50,000 ఇవ్వాలంటూ కానిస్టేబుల్ యశ్వంత్ యాదవ్ కోరాడు. అందుకు దిలీప్ నిరాకరించాడు. దీంతో కానిస్టేబుల్ యశ్వంత్.. దిలీప్పై దాడి చేశాడు. అనంతరం మరో కానిస్టేబుల్ మహేష్ ఉపాధ్యాయ్ జోక్యం చేసుకుని రూ.40,000కు బేరం కుదిర్చాడు. అనంతరం దిలీప్ను విడిచిపెట్టేశారు.
ఇది కూడా చదవండి: AP High Court: ప్రసన్నకుమార్రెడ్డిపై హైకోర్టు సీరియస్.. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా..?
అయితే ఈ ఘటనపై దిలీప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి చేరుకున్న దిలీప్.. వేసుకున్న ప్యాంట్పై భార్య తండ్రి వాన్వారీ లాలా, ఆమె సోదరుడు రాజు, అతని బావమరిది రజనేష్ రాజ్పుత్, ఇద్దరు కానిస్టేబుల్ వేధించి కొట్టారని.. పోలీసులు లంచం కూడా డిమాండ్ చేశారని సూసైడ్ నోట్ రాసి గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రూ.40,000 చెల్లించాకే పోలీసులు విడిచిపెట్టారని పేర్కొన్నాడు. కుమారుడు మరణంపై దిలీప్ తండ్రి పోలీసులకు ఫిర్యాద చేశాడు. దిలీప్ భార్య, ఆమె కుటుంబ సభ్యులు, ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టారని ఫిర్యాదు చేశాడు.
భార్యాభర్తల కొట్లాటపై సోమవారం ఫిర్యాదు అందిందని పోలీసు సూపరింటెండెంట్ ఆర్తి సింగ్ తెలిపారు. రాజీ కుదిర్చేందుకు సహాయం చేశామని.. కానీ దిలీప్ ఇంటికి చేరుకోగానే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. పోస్ట్మార్టం రిపోర్టులో ఎటువంటి గాయాలు లేవని తేలిందన్నారు. బంధువులు, కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..