Bombay High Court: భార్యకి వివాహేతర సంబంధం, ‘‘వాయిస్ రికార్డ్’’లతో కోర్టుకెక్కిన భర్త.. హైకోర్టు సంచలన ఆదేశాలు..
- భార్యకు వివాహేతర సంబంధం ఉందని కోర్టుకెక్కిన భర్త..
- వాయిస్ రికార్డులు ను కోర్టు ముందించిన వ్యక్తి..
- ‘‘వాయిస్ నమూనా’’ ఇవ్వాలంటూ భార్యకు కోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: భార్యకు వివాహేత సంబంధం ఉందని ఓ భర్త కోర్టుకెక్కాడు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని చెబుతూ కొన్ని రికార్డింగ్స్ని కూడా కోర్టు ముందుంచారు. అయితే, ఈ కేసులో బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. భర్త చేసిన వాదనల్ని ధ్రువీకరించడానికి ‘‘వాయిస్ శాంపిల్స్’’ ఇవ్వాల్సిందిగా భార్యని ఆదేశించింది. మే 9న జస్టిస్ శైలేష్ బ్రహ్మే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వుల్ని జారీ చేసింది. గృహ హింస చట్టం ప్రకారం, ఒక పార్టీని వాయిస్ నమూనాలను అందించమని ఆదేశించడానికి ఎటువంటి నిబంధనలు లేవని, కానీ ప్రస్తుత కేసులో విచారణలు పాక్షిక-సివిల్, పాక్షిక-క్రిమినల్ రెండూ అని పేర్కొంది.
విడిపోయిన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని నిరూపించడానికి భర్త తాను సాక్ష్యాలుగా సమర్పించిన వాయిస్ రికార్డుల్ని ధ్రువీకరించడానికి ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించాలని కోర్టుని కోరాడు. దీనిపై, హైకోర్టు వాయిస్ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరణ కోసం పంపాలని ఆదేశించింది.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
Read Also: Turkey: అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ.. ఇండియా దెబ్బకు విలవిల..
పురుషుడు సమర్పించిన ఆధారాలకు ప్రోబేటివ్ విలువ ఉన్నందున, ధ్రువీకరణ కోసం మహిళ తన వాయిస్ నమూనాలను ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. అయితే, తన భర్త సమర్పించిన మెమోరీ కార్డ్, సీడీలు సాక్ష్యాలుగా అర్హత కాదని, ఎందుకంటే వాయిస్ రికార్డింగ్కి ఉపయోగించిన సెల్ఫోన్ అందుబాటులో లేని మహిళ కోర్టుకు తెలిపింది. అయితే, ఆమె వాదనల్ని కోర్టు అంగీకరించలేదు. సాంకేతిక పరిజ్ఞానం రాకతో, ఎలక్ట్రానిక్ ఆధారాలు సాంప్రదాయ సాక్ష్యాలను భర్తీ చేస్తున్నాయని కోర్టు చెప్పింది.
ఈ కేసును పరిశీలిస్తే, సదరు మహిళ తనపై భర్త, అత్తమామలు గృహహింసకు పాల్పడుతున్నారని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. అయితే, భర్త తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహేతర సంబంధం ఉందని, భార్య ఆమె ప్రియుడు మాట్లాడుకున్న వాయిస్ రికార్డింగ్లను ఫ్యామిలీ కోర్టు ముందుంచారు. అయితే, వీటిని సదరు మహిళ తోసిపుచ్చింది. రికార్డింగ్లోని వాయిస్ తనది కాదని చెప్పింది. దీనిని ధ్రువీకరించడానికి భార్య వాయిస్ శాంపిల్స్ ఇచ్చేలా ఆదేశించాలని అహల్యానగర్ జిల్లాలోని పార్నర్లోని మేజిస్ట్రేట్ కోర్టులో అతను ఒక దరఖాస్తును దాఖలు చేశాడు. మేజిస్ట్రేట్ ఆ దరఖాస్తును తిరస్కరించాడు, ఆ తర్వాత అతను హైకోర్టును ఆశ్రయించాడు.ఫిబ్రవరి 2024లో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. మూడు వారాల్లోగా ఆమె స్వర నమూనాను ఇవ్వాలని ఆ మహిళను ఆదేశించింది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!