Mamata Banerjee: బీఎస్ఎఫ్పై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..
- బెంగాల్లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు..
- బీఎస్ఎఫ్ కారణం అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాక్యలు చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అనుమతిస్తుందని గురువారం ఆరోపించారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ ప్లాన్ కేంద్రం యొక్క ‘‘నీచమైన బ్లూ ప్రింట్’’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ బెంగాల్లోకి చొరబాట్లను అనుమతిస్తోందని, మహిళలను హింసిస్తోందని ఆరోపించారు.
‘‘బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు’’ బెంగాల్లో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కొన్ని రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల తర్వాత మమత నుంచి తాజా కామెంట్స్ వచ్చాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ అంశం టీఎంసీ-బీజేపీ మధ్య చర్చనీయాంశంగా మారింది.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read Also: Nimisha Priya case: యెమెన్లో నిమిషా ప్రియాకు మరణశిక్ష.. రక్షించేందుకు ఇరాన్ సాయం..
‘‘బీఎస్ఎఫ్ వివిధ ప్రాంతాల నుండి బెంగాల్లోకి చొరబాట్లను అనుమతిస్తోంది మరియు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తోంది, టీఎంసీ సరిహద్దులను కాపాడటం లేదు కదా, సరిహద్దు మన చేతుల్లో లేదు, కాబట్టి ఎవరైనా టీఎంసీ చొరబాట్లను అనుమతించిందని ఆరోపిస్తే, అది బిఎస్ఎఫ్ బాధ్యత అని నేను ఎత్తి చూపుతాను.’’ అని మమతా బెనర్జీ అన్నారు. చొరబాట్లను అనుమతించే ప్రాంతాలను దర్యాప్తు చేసి గుర్తించాలని డీజీపీని ఆదేశిస్తానని చెప్పారు.
పోలీసుల వద్ద సమాచారం ఉందని, కేంద్ర వద్ద కూడా ఉందని, ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాస్తానని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్తో మాకు శత్రుత్వం లేదు, కానీ ఇక్కడ గుండాలను అనుమతించి, వారు నేరాలకు పాల్పడిన తర్వాత సరిహద్దు దాటుతున్నారని, బీఎస్ఎఫ్ ఇదంతా చేస్తుందని, దీంట్లో కేంద్రం పాత్ర ఉందని ఆరోపించారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య 4096 కి.మీ సరిహద్దు కలిగి ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ చొరబాట్లకు బెంగాల్ నర్సరీగా మారిందని అన్నారు. ఓట్ల కోసం మమతా బెనర్జీ ఇలా చేస్తున్నారని, బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యాలకు బెంగాల్ గేట్వేగా మారిందని అన్నారు.
- Tags
- Bangladesh
- bjp
- BSF
- Mamata Banerjee
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..