Himanta Sarma: మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలి.. ‘‘మెస్సీ’’ ఈవెంట్పై అస్సాం సీఎం ఫైర్..
- మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలి..
- మెస్సీ ఈవెంట్ గందరగోళంపై హిమంత బిశ్వ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Sarma: ఫుట్బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన తీవ్ర గందగోళానికి దారి తీసింది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మెస్సీ ‘GOAT టూర్ 2025’ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ ఈ గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. ముఖ్యమంత్రి, హోంమంత్రి మమతా బెనర్జీని, కోల్కతా పోలీస్ కమిషనర్ను అరెస్ట్ చేసి ఉండాలి’’ అని అన్నారు. ఈవెంట్ నిర్వాహకుడిని అరెస్ట్ను తాను సమర్థించడం లేదా వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు. మొదటి బాధ్యత హోం మంత్రి, పోలీస్ కమిషనర్లదని చెప్పారు.
Read Also: Startup Journey: సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి… దోశల వ్యాపారంలోకి వచ్చిన యువకుడు
Also Read
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
బెంగాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని అన్నారు. సింగర్ జుబీన్ గార్గ్ మరణం తర్వాత గౌహతిలో జరిగిన భారీ ప్రజా సమావేశాలు, ముంబైలో మహిళ ప్రపంచకప్ నిర్వహరణ ఎంతో బాగా జరిగాయని, కానీ బెంగాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఊహించలేని రాష్ట్రమని, అక్కడి VIP సంస్కృతి తీవ్ర స్థాయిలో ఉందని మండిపడ్డారు. ‘‘మెస్సీ మొత్తం ప్రపంచానికి ఆదర్శం. మమతా బెనర్జీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. బెంగాల్లో ప్రతిరోజూ అమాయక ప్రజలు దారుణాలకు గురవుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం’’ అని హిమంత అన్నారు.
ఫుట్బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ పాల్గొన్న కోల్కతా ఈవెంట్లో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి తాను “తీవ్రంగా కలత చెందానని, షాక్ అయ్యానని” శుక్రవారం బెనర్జీ అన్నారు. అర్జెంటీనా స్టార్ మెస్సీ కొద్దిసేపు కనిపించిన తర్వాత వేదిక లోపల గందరగోళం చెలరేగడంతో క్రీడా అభిమానులకు ఆమె క్షమాపణలు చెప్పారు. ఈ దురదృష్టకర సంఘటనకు లియోనల్ మెస్సీకి, అలాగే క్రీడా అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నట్లు మమతా బెనర్జీ ఎక్స్లో ట్వీట్ చేశారు. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ చుట్టూ వీఐపీలు, రాజకీయ నాయకులు మాత్రమే ఉండటంతో, ఆయనను చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో ఉన్న అభిమానులు మైదానంలోకి ప్లాస్టిక్ బాటిళ్లు, కుర్చీలు, టెంట్లు విసిరేశారు.
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!