Startup Journey: సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి… దోశల వ్యాపారంలోకి వచ్చిన యువకుడు
- స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్న యువత
- జర్మనీలోని ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్లో ఉద్యోగాన్ని వదిలేసిన మోహన్
- తన స్నేహితులతో కలిసి “దోసమా” అనే స్టార్టప్ను ప్రారంభించిన మోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యువత లక్షల రూపాయల జీతాలు వచ్చే ఉద్యోగాలను వదిలేసి, స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. టీ స్టాళ్లు, కాఫీ షాపులు, టిఫిన్ సెంటర్లు వంటి చిన్న వ్యాపారాల నుంచి స్టార్టప్ల వరకు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో ఒకరు మోహన్. జర్మనీలోని ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్లో ఉద్యోగాన్ని వదిలేసి దోశల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ యువకుడి కథ ఇప్పుడు అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, మోహన్ పారిస్లో స్కాలర్షిప్తో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం జర్మనీలో ఇంటెల్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీల్లో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాల్లో పని చేశాడు. అయితే ఈ ఉద్యోగాలు అతనికి అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. తనలోని ప్యాషన్ను అనుసరించాలనే ఆలోచనతో 2023లో తన స్నేహితులతో కలిసి “దోసమా” అనే స్టార్టప్ను ప్రారంభించాడు.
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
ఇంటెల్ వంటి భారీ టెక్ కంపెనీలోని ఉద్యోగాన్ని వదిలేసి దోశల వ్యాపారం ప్రారంభించడాన్ని చూసి మొదట్లో చాలామంది ఇది ఒక “విచిత్రమైన నిర్ణయం” అంటూ విమర్శించారు. కానీ మోహన్ మాత్రం దీనిని తన కలగా భావించి, విజయం సాధించేందుకు అహర్నిశలు కృషి చేశాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. “అమెరికా బర్గర్లు, ఇటలీ పిజ్జాలు భారత్కు వచ్చాయి కదా… మరి భారతీయ వంటకాలు పారిస్కు ఎందుకు వెళ్లకూడదు?” అనే ఆలోచనతో యూరప్లో “దోసమా” ఔట్లెట్లను ప్రారంభించాడు.
ఈరోజు “దోసమా” పారిస్ నుంచి లండన్ వరకు విస్తరించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రాండ్గా మారింది. భారతీయ ఆహార సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా మోహన్ ముందుకు సాగుతున్నాడు. డిసెంబర్ 2025లో పుణేలోని ఎఫ్సీ రోడ్డుపై “దోసమా” బ్రాంచ్ ప్రారంభం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం మోహన్ ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతదేశపు ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడని అనేక మంది అతన్ని అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?