Mamata Banerjee: ‘‘మోడీకి గుడి కట్టించి, ధోక్లా ప్రసాదంగా ఇస్తాం’’.. ప్రధానిపై మమత సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనను దేవుడు ఒక పని కోసం పంపాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. కోల్కతాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మోడీ నను తాను దేవుడిగా భావిస్తే , ప్రధాని పీఠంపై కూర్చుని దేశాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి అతనికి ఒక దేవాలయాన్ని నిర్మించాలని అన్నారు. దేవుళ్లతో రాజకీయాలు చేసి అల్లర్లను ప్రేరేపించొద్దని సూచించారు.
‘‘ఒకరు తాను (ప్రధాని మోడీ) దేవుడని అంటారు. ఒక నాయకుడు జనన్నాథుడు మోడీ భక్తుడు అని అంటారు. ఆయనకు గుడి కట్టి పూజలు చేయండి, ప్రసాదం, పూలు సమర్పించండి. ఆయనకిష్టమైతే ధోక్లా కూడా అందచేస్తాం’’ అని ఆమె ఎగతాళి చేశారు. ప్రధాని మోదీ ఇటీవల ఒక న్యూస్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జీవసంబంధమైనవాడిని కాదని, దేవుడిచే పంపబడ్డానని పేర్కొన్న నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Pakistan: మోడీ ఓడిపోవాలని పాక్ కోరుకుంటోంది.. మాజీ మంత్రి అక్కసు..
ఇటీవల బీజేపీ నేత, పూరీ నుంచి పోటీలో ఉన్న సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. జగన్నాథుడు మోడీ భక్తులు అంటూ వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదమైంది. పాత్ర తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు. తను అనుకోకుండా నోరుజారానని అన్నారు. దీనికి అతను ఉపవాసం దీక్ష కూడా చేపట్టారు.
ప్రధాని మోడీని విమర్శించిన మమతా బెనర్జీ మాట్లాడుతూ..‘‘ నేను చాలా మంది ప్రధానులతో పనిచేశాను. అటల్ బిహారీ వాజ్పేయి, నన్ను చాలా ప్రేమించేవారు. నేను మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ, నర్శింహారావు, దేవెగౌడలతో పనిచేశాను. అయితే, ప్రధాని మోడీ లాంటి వారిని నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటి ప్రధాని అవసరం లేదని అన్నారు. జూన్ 1న జరిగే చివరి దశ ఓటింగ్కి ముందు మంగళవారం కోల్కతాలో ప్రధాని మోడీతో పాటు, సీఎం మమతా బెనర్జీ మెగా రోడ్షోలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!