Mamata Banerjee: ‘‘మోడీకి గుడి కట్టించి, ధోక్లా ప్రసాదంగా ఇస్తాం’’.. ప్రధానిపై మమత సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనను దేవుడు ఒక పని కోసం పంపాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. కోల్కతాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మోడీ నను తాను దేవుడిగా భావిస్తే , ప్రధాని పీఠంపై కూర్చుని దేశాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి అతనికి ఒక దేవాలయాన్ని నిర్మించాలని అన్నారు. దేవుళ్లతో రాజకీయాలు చేసి అల్లర్లను ప్రేరేపించొద్దని సూచించారు.
‘‘ఒకరు తాను (ప్రధాని మోడీ) దేవుడని అంటారు. ఒక నాయకుడు జనన్నాథుడు మోడీ భక్తుడు అని అంటారు. ఆయనకు గుడి కట్టి పూజలు చేయండి, ప్రసాదం, పూలు సమర్పించండి. ఆయనకిష్టమైతే ధోక్లా కూడా అందచేస్తాం’’ అని ఆమె ఎగతాళి చేశారు. ప్రధాని మోదీ ఇటీవల ఒక న్యూస్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జీవసంబంధమైనవాడిని కాదని, దేవుడిచే పంపబడ్డానని పేర్కొన్న నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Pakistan: మోడీ ఓడిపోవాలని పాక్ కోరుకుంటోంది.. మాజీ మంత్రి అక్కసు..
ఇటీవల బీజేపీ నేత, పూరీ నుంచి పోటీలో ఉన్న సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. జగన్నాథుడు మోడీ భక్తులు అంటూ వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదమైంది. పాత్ర తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు. తను అనుకోకుండా నోరుజారానని అన్నారు. దీనికి అతను ఉపవాసం దీక్ష కూడా చేపట్టారు.
ప్రధాని మోడీని విమర్శించిన మమతా బెనర్జీ మాట్లాడుతూ..‘‘ నేను చాలా మంది ప్రధానులతో పనిచేశాను. అటల్ బిహారీ వాజ్పేయి, నన్ను చాలా ప్రేమించేవారు. నేను మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ, నర్శింహారావు, దేవెగౌడలతో పనిచేశాను. అయితే, ప్రధాని మోడీ లాంటి వారిని నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటి ప్రధాని అవసరం లేదని అన్నారు. జూన్ 1న జరిగే చివరి దశ ఓటింగ్కి ముందు మంగళవారం కోల్కతాలో ప్రధాని మోడీతో పాటు, సీఎం మమతా బెనర్జీ మెగా రోడ్షోలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!