Dr K Laxman: బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదు..
- బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదు..
- ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు-రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు,రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ లో అసమర్థ పాలన కొనసాగుతోందన్నారు. పాలన వదిలేసి మంత్రులంతా ఢిల్లీకి గులాం గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయాలన్ని నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. గురుకులాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థుల మరణ మృదంగా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకే రేవంత్ సర్కార్ హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. చినుకు పాటు వర్షం వస్తే నగరం సంద్రoలా మారుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో వైద్యం పడకేసిందని మండిపడ్డారు. సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులన్ని రోగులతో కిక్కిరిసి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కు ఓట్లేసినందుకు రాష్ట్ర ప్రజలకు వాతలు, బాధలు తప్ప ఏం లేదన్నారు. మహాలక్ష్మి పథకం నీరు కారిపోయిందని మండిపడ్డారు. బస్సులు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: G. Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
- Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
31 కోట్లు మాఫీ అన్నారు, రైతులను నిలువునా మోసం చేశారని.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్, దానికి అభివృద్ధి పట్టదు, ప్రజా సంక్షేమం పట్టదన్నారు. కాంగ్రెస్ విధానాలకు రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. రైతులు పంట భీమకు నోచుకునే పరిస్థుతులు లేవన్నారు. రైతులకు పంట బీమా లేదు, పసల్ బీమా లేదన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా కుంటు పడిందన్నారు. బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 40 మందికి పైగా విద్యార్థులు చనిపోయారన్నారు. దిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం దిగజారుడు తనానికి నిదర్శనమని, సిద్ధాంతానికి నిదర్శనం బీజేపీ పార్టీ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హోల్ సెల్ రాజకీయాలకు పాల్పడటం మంచి పద్దతి కాదన్నారు.
CM Revanth Reddy: ఐఐహెచ్టీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు.. అధికారులకు సీఎం ఆదేశాలు..
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
-
Lashkar-e-Taiba: పాకిస్థాన్లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!