Dr K Laxman: బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదు..
- బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదు..
- ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు-రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు,రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ లో అసమర్థ పాలన కొనసాగుతోందన్నారు. పాలన వదిలేసి మంత్రులంతా ఢిల్లీకి గులాం గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయాలన్ని నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. గురుకులాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థుల మరణ మృదంగా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకే రేవంత్ సర్కార్ హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. చినుకు పాటు వర్షం వస్తే నగరం సంద్రoలా మారుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో వైద్యం పడకేసిందని మండిపడ్డారు. సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులన్ని రోగులతో కిక్కిరిసి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కు ఓట్లేసినందుకు రాష్ట్ర ప్రజలకు వాతలు, బాధలు తప్ప ఏం లేదన్నారు. మహాలక్ష్మి పథకం నీరు కారిపోయిందని మండిపడ్డారు. బస్సులు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: G. Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
31 కోట్లు మాఫీ అన్నారు, రైతులను నిలువునా మోసం చేశారని.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్, దానికి అభివృద్ధి పట్టదు, ప్రజా సంక్షేమం పట్టదన్నారు. కాంగ్రెస్ విధానాలకు రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. రైతులు పంట భీమకు నోచుకునే పరిస్థుతులు లేవన్నారు. రైతులకు పంట బీమా లేదు, పసల్ బీమా లేదన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా కుంటు పడిందన్నారు. బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 40 మందికి పైగా విద్యార్థులు చనిపోయారన్నారు. దిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం దిగజారుడు తనానికి నిదర్శనమని, సిద్ధాంతానికి నిదర్శనం బీజేపీ పార్టీ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హోల్ సెల్ రాజకీయాలకు పాల్పడటం మంచి పద్దతి కాదన్నారు.
CM Revanth Reddy: ఐఐహెచ్టీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు.. అధికారులకు సీఎం ఆదేశాలు..
తాజావార్తలు
-
Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
-
Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
-
G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!