Opposition Meeting: ఈ నెల 17-18న బెంగళూర్ వేదిక విపక్షాల భేటీ.. ఖర్గే ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition Meeting: గత నెలలో పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల భేటీ జరిగింది. ముందుగా సిమ్లా వేదిక రెండోసారి ప్రతిపక్షాలు భేటీ కావాలని అనుకున్నాయి. అయితే ఈ వేదికను బెంగళూర్ కి మార్చారు. ఈ నెల 17-18 తేదీల్లో బెంగళూర్ వేదికగా రెండోసారి విపక్షాల భేటీ జరగబోతోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో మోడీని, బీజేపీ అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో విపక్షాలు అన్నీ ఐక్యంగా పోరాడాలని అనుకుంటున్నాయి. మొదటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆర్జేడీ, టీఎంసీ, జేడీయూ, ఆప్ పార్టీలతో పాటు 15 పార్టీలు సమావేశానికి హాజరై ఉమ్మడిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి.
Read Also: Ponnala Lakshmaiah : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఇదిలా ఉంటే బెంగళూర్ లో జరిగే భేటీకి హాజరు కావాల్సిందిగా ఎన్డీయేతర విపక్షాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పలికారు. జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో జరిగిన విపక్ష సమావేశంలో తాము పాల్గొన్న విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిపక్ష పార్టీ అగ్ర నేతలకు రాసిన లేఖలో గుర్తు చేశారు. పాట్నా సమావేశంలో మన ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే వివిధ అంశాలపై చర్చించామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేందుకు ఏకగ్రీవంగా అంగీకారానికి వచ్చాము కాబట్టి ఈ సమావేశం విజయవంతమైందని ఖర్గే తన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. జులైలో మరోసారి సమావేశం కావడానికి మేము ఇంకా అంగీకరించామని కాంగ్రెస్ అధ్యక్షుడు నాయకులకు గుర్తు చేశారు. విపక్షాల ఐక్యతను కొనసాగించేందుకు జూలై 17-18 తేదీల్లో సమావేశాలు జరుగుతాయని ఆయన అన్ని విపక్షాలకు ఆహ్వానం పంపారు.
గతంలో పాట్నాలో జరిగిన సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ హాజరయ్యారు. బెంగళూర్ లో జరిగే సమావేశంలో ఏ విధంగా పోటీ చేద్ధాం..? సీట్ల పంపకాల విషయం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!