Maldives: 43 మంది భారతీయుల్ని బహిష్కరించిన మాల్దీవ్స్.. చైనాపై మాత్రం చర్యలు లేవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్కాట్ మాల్దీవులు’’ హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Read Also: AP High Court: జనసేనకు గ్లాస్ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టు విచారణ
Also Read
- CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్పై స్టాలిన్ విమర్శలు
- Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
- Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
- Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్కు జిన్పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
ఇదిలా ఉంటే, మరోసారి మాల్దీవులు భారత వ్యతిరేక వైఖరిని కనబరిచింది. అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే పేరుతో 43 మంది భారతీయులతో సహా 12 వేర్వేరు దేశాలకు చెందిన 186 మంది విదేశీయులను బహిష్కరించింది. అయితే, చైనాకు చెందిన ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరు. బహిష్కరణకు గురైన వారిలో బంగ్లాదేశ్ నుంచి 83 మంది ఉండగా.. భారత్ నుంచి 43 మంది, శ్రీలంక నుంచి 25 మంది, నేపాల్ నుంచి 8 మంది ఉన్నారు. అయితే, వారి బహిష్కరణ తేదీ ఇంకా తెలియరాలేదు. బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న విదేశీయులు అక్రమంగా దేశంలో నిర్వహిస్తున్న వ్యాపారాలను మూసేసే ప్రయత్నాలను చేపట్టామని మాల్దీవుల హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నమోదిత యజమానికి బదులుగా విదేశీయలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించింది.
186 మంది విదేశీయులను బహిష్కరించినట్లు మాల్దీవుల ఇమ్మిగ్రేషన్ కంట్రోలర్ షమాన్ వహీద్ తెలిపారు. అయితే, చైనా నుంచి ఒక్క వ్యక్తి కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే, ముయిజ్జూ మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు వెళ్లాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. సాధారణంగా మాల్దీవులకు ఎన్నికైన ఏ అధ్యక్షుడైనే ముందుగా భారత్ని సందర్శిస్తుంటారు. అయితే, ఈ సారి ముయిజ్జూ మాత్రం చైనా పర్యటనకు వెళ్లారు.
తాజావార్తలు
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్పై భారత్ 19-0తో సంచలన విజయం.!
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?