Maldives: 43 మంది భారతీయుల్ని బహిష్కరించిన మాల్దీవ్స్.. చైనాపై మాత్రం చర్యలు లేవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్కాట్ మాల్దీవులు’’ హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Read Also: AP High Court: జనసేనకు గ్లాస్ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టు విచారణ
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
ఇదిలా ఉంటే, మరోసారి మాల్దీవులు భారత వ్యతిరేక వైఖరిని కనబరిచింది. అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే పేరుతో 43 మంది భారతీయులతో సహా 12 వేర్వేరు దేశాలకు చెందిన 186 మంది విదేశీయులను బహిష్కరించింది. అయితే, చైనాకు చెందిన ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరు. బహిష్కరణకు గురైన వారిలో బంగ్లాదేశ్ నుంచి 83 మంది ఉండగా.. భారత్ నుంచి 43 మంది, శ్రీలంక నుంచి 25 మంది, నేపాల్ నుంచి 8 మంది ఉన్నారు. అయితే, వారి బహిష్కరణ తేదీ ఇంకా తెలియరాలేదు. బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న విదేశీయులు అక్రమంగా దేశంలో నిర్వహిస్తున్న వ్యాపారాలను మూసేసే ప్రయత్నాలను చేపట్టామని మాల్దీవుల హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నమోదిత యజమానికి బదులుగా విదేశీయలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించింది.
186 మంది విదేశీయులను బహిష్కరించినట్లు మాల్దీవుల ఇమ్మిగ్రేషన్ కంట్రోలర్ షమాన్ వహీద్ తెలిపారు. అయితే, చైనా నుంచి ఒక్క వ్యక్తి కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే, ముయిజ్జూ మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు వెళ్లాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. సాధారణంగా మాల్దీవులకు ఎన్నికైన ఏ అధ్యక్షుడైనే ముందుగా భారత్ని సందర్శిస్తుంటారు. అయితే, ఈ సారి ముయిజ్జూ మాత్రం చైనా పర్యటనకు వెళ్లారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!