Maharastra: ఔరంగాజేబు సమాధి మూసివేత… జ్ఞానవాపి విచారణ సమయంలో కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మసీదులో కోర్ట్ నియమించిన కమిషనర్లు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఈ సర్వేను ఆపేయాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. సర్వేలో భాగంగా మసీదు ‘ వాజుఖానా’ లోని బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్, శివలింగం బయటపడిన ప్రదేశానికి భద్రత కల్పించాల్సిందిగా వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ రోజు మరోసారి జ్ఞానవాపి మసీదు సర్వేపై సుప్రీంలో విచారణ జరిగింది. మే 20 వరకు సుప్రీం కోర్ట్ విచారణ జరిపే వరకు వారణాసి కోర్ట్ విచారణను నిలిపివేయాలంటూ గురువారం ఆదేశాలు జరీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే కోర్ట్ ఆదేశాలు వెల్లడించిన తర్వాత మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
ప్రస్తుతం కోర్ట్ పరిధిలో జ్ఞానవాపి మసీదు వివాదం నడుస్తోంది. ఈ సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జౌరంగాబాద్ ఖుల్తాబాద్ లో ఉన్న ఔరంగజేబు సమాధికి తాళం వేశారు. దీంతో పాటు సెక్యురిటీ గార్డులను ఏర్పాటు చేశారు. ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా, మసీదు కమిటీ సమాధికి తాళం వేశాయి. ఇటీవల మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధికార ప్రతినిధి గజానన్ కాలే స్మారకాన్ని ధ్వంసం చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అయితే మొగల్ పాలకుడు ఔరంగజేబ్ పాలనలోనే జ్ఞానవాపి ఆలయాన్ని కూల్చి మసీదుగా మార్చారని చరిత్ర చెబుతోంది.
తాజావార్తలు
-
Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
-
EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
-
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
-
Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!
-
Pickleball Players’ Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!