Maharastra: ఔరంగాజేబు సమాధి మూసివేత… జ్ఞానవాపి విచారణ సమయంలో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మసీదులో కోర్ట్ నియమించిన కమిషనర్లు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఈ సర్వేను ఆపేయాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. సర్వేలో భాగంగా మసీదు ‘ వాజుఖానా’ లోని బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్, శివలింగం బయటపడిన ప్రదేశానికి భద్రత కల్పించాల్సిందిగా వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ రోజు మరోసారి జ్ఞానవాపి మసీదు సర్వేపై సుప్రీంలో విచారణ జరిగింది. మే 20 వరకు సుప్రీం కోర్ట్ విచారణ జరిపే వరకు వారణాసి కోర్ట్ విచారణను నిలిపివేయాలంటూ గురువారం ఆదేశాలు జరీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే కోర్ట్ ఆదేశాలు వెల్లడించిన తర్వాత మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
ప్రస్తుతం కోర్ట్ పరిధిలో జ్ఞానవాపి మసీదు వివాదం నడుస్తోంది. ఈ సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జౌరంగాబాద్ ఖుల్తాబాద్ లో ఉన్న ఔరంగజేబు సమాధికి తాళం వేశారు. దీంతో పాటు సెక్యురిటీ గార్డులను ఏర్పాటు చేశారు. ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా, మసీదు కమిటీ సమాధికి తాళం వేశాయి. ఇటీవల మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధికార ప్రతినిధి గజానన్ కాలే స్మారకాన్ని ధ్వంసం చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అయితే మొగల్ పాలకుడు ఔరంగజేబ్ పాలనలోనే జ్ఞానవాపి ఆలయాన్ని కూల్చి మసీదుగా మార్చారని చరిత్ర చెబుతోంది.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!