Maharastra: ఔరంగాజేబు సమాధి మూసివేత… జ్ఞానవాపి విచారణ సమయంలో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మసీదులో కోర్ట్ నియమించిన కమిషనర్లు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఈ సర్వేను ఆపేయాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. సర్వేలో భాగంగా మసీదు ‘ వాజుఖానా’ లోని బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్, శివలింగం బయటపడిన ప్రదేశానికి భద్రత కల్పించాల్సిందిగా వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ రోజు మరోసారి జ్ఞానవాపి మసీదు సర్వేపై సుప్రీంలో విచారణ జరిగింది. మే 20 వరకు సుప్రీం కోర్ట్ విచారణ జరిపే వరకు వారణాసి కోర్ట్ విచారణను నిలిపివేయాలంటూ గురువారం ఆదేశాలు జరీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే కోర్ట్ ఆదేశాలు వెల్లడించిన తర్వాత మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
ప్రస్తుతం కోర్ట్ పరిధిలో జ్ఞానవాపి మసీదు వివాదం నడుస్తోంది. ఈ సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జౌరంగాబాద్ ఖుల్తాబాద్ లో ఉన్న ఔరంగజేబు సమాధికి తాళం వేశారు. దీంతో పాటు సెక్యురిటీ గార్డులను ఏర్పాటు చేశారు. ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా, మసీదు కమిటీ సమాధికి తాళం వేశాయి. ఇటీవల మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధికార ప్రతినిధి గజానన్ కాలే స్మారకాన్ని ధ్వంసం చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అయితే మొగల్ పాలకుడు ఔరంగజేబ్ పాలనలోనే జ్ఞానవాపి ఆలయాన్ని కూల్చి మసీదుగా మార్చారని చరిత్ర చెబుతోంది.
తాజావార్తలు
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!