Maharashtra Political Crisis: ఫడ్నవీస్, షిండే మధ్య కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. మూడోసారి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపడుతారని.. డిప్యూటీ సీఎం పదవి ఏక్ నాథ్ షిండేకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు గురించి బీజేపీ పెద్దలు చర్చిస్తున్నారు. సీటీ రవి, పార్టీ నేతలు చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్ వంటి నేతలు సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 144గా ఉంది. అయితే బీజేపీకి సొంతంగా 106 ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో పాటు షిండే వర్గం 39 మంది ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు 12 మంది, ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే ఒక్కరు, బీవీఏ పార్టీ నుంచి ఇద్దరు, కొత్తగా మరో 07 మంది స్వతంత్రుల మద్దతు బీజేపీకి ఉంది. దీంతో బీజేపీకి మొత్తం 167 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేతో ఫడ్నవీస్ ఫోన్ లో మాట్లాడరు. క్యాబినెట్ కూర్పు గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. రెబెల్ క్యాంపుతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఎవరెవరకి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. షిండే క్యాంపులో ఎమ్మెల్యేల్లో 10-12 మందికి మంత్రి పదవులు వస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎవరికి, ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని.. త్వరలో జరుగుతుందని, అప్పటి వరకు మంత్రుల జాబితాలు, పుకార్లు నమ్మవద్దని శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే అన్నారు.
తాజావార్తలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!