Priyanka Jain: శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక.. ఇంతకు ఏమైందంటే ?
- భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ
- సరదా కోసం చేశామంటూ వీడియో రిలీజ్
- క్రిమినల్ కేసు పెట్టాలంటున్న భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Jain: తిరుమల శ్రీవారి భక్తులకు, టీటీడీకి క్షమాపణలు చెప్తూ బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ వీడియో విడుదల చేశారు. సరదా కోసం చేసిన వీడియో ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఊహించలేదు. కేవలం వినోదం కోసమే ఆ వీడియో చేశామని ప్రకటించారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీయాలన్నో లేక భక్తుల మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం మాకు లేదని చెప్పుకొచ్చారు. తెలియక చేసిన తప్పుని మీరందరూ క్షమించాలని కోరుతున్నామన్నారు.
Read Also:Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వేలంలో ఉంటే.. రూ.520 కోట్లు కూడా సరిపోవు!
Also Read
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
అసలేమైందంటే.. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అడ్డమైన పనులు చేస్తున్నారు. ఇటీవల ప్రాంక్ వీడియోలు బాగా పెరిగాయి. వాటికి విపరీతమైన లైక్లు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి కాబట్టి అందరూ ఫాలో అవుతున్నారు. ఇలా ఫాలో అవ్వడం తప్పేమీ కాదు. కానీ ఏం చేస్తున్నారో, ఎక్కడ చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రాంక్ వీడియోలు తీస్తున్నారు. తాజాగా అలాంటి పనే చేసింది బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక. ఇటీవల ప్రియాంక తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలురాయి నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యలో కొన్ని రీల్స్ చేశారు ఈ ఇద్దరు.
Read Also:Harish Rao: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై హరీష్ రావుపై కేసు నమోదు
చిరుత అరుపును రీల్స్లో యాడ్ చేసి చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. తీరా చూస్తే అక్కడ చిరుత కనిపించలేదని అంతా తూచ్ అంటూ ఫ్రాంక్ చేశారు. గతంలో కూడా ఇదే స్థలంలో చిరుతపులి ఓ చిన్నారిని చంపేసింది. ఇలాంటి చేష్టలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పవిత్ర తిరుమలలో భక్తి భావం లేకుండా రీల్స్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఇదే విధంగా ఫ్రాంక్ చేయడంతో వారిపై టీటీడీ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రియాంకపై కూడా టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!