Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో అధికారం బీజేపీ కూటమిదే.. ఆర్ఎస్ఎస్ సర్వేలో వెల్లడి..
- మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి..
- మరోసారి బీజేపీ కూటమిదే అధికారం..
- ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వేలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Assembly Elections: దేశం మొత్తం మహారాష్ట్ర్ర అసెంబ్లీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, జమ్మూ కాశ్మీర్లో ఫలితాల తర్వాత మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతాయా..? అని అంతా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలో రెండు కూటములు- బీజేపీ నేతృత్వంని ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(షిండే)ల ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ(శరద్ పవార్), ఉద్ధవ్ ఠాక్రే శివసేనల ‘మహా వికాస్ అఘాడీ’ కూటముల మధ్య పోరు నెలకొంది. నవంబర్ 20న రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇరు కూటముల్లో పొత్తులు కొలిక్కి వచ్చాయి.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ఇదిలా ఉంటే.. బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నిర్వహించిన అంతర్గత సర్వేలో బీజేపీ కూటమి మహాయుతి మళ్లీ అధికారం సాధిస్తుందని తేలింది. అక్టోబర్ తొలినాళ్లలో ఆర్ఎస్ఎస్ ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. 288 సీట్లలో మహాయుతికి 160కి పైగా సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. బీజేపీకి 90 నుంచి 95, శివసేన(షిండే) పార్టీకి 40-50 సీట్లు, ఎన్సీపీ(అజిత్ పవార్)కి 25-30 సీట్లు వస్తాయని చెప్పింది. ఈ అంచనాలు నిజమైతే మళ్లీ బీజేపీ మహారాష్ట్రలో అధికారం చేపట్టనుంది.
మరోవైపు హర్యానా ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ గెలుపుకు కీలకంగా వ్యవహరించింది. క్షేత్రస్థాయిలో స్వయంసేవకులు పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా అదే మ్యాజిక్ చేసేలా ఆర్ఎస్ఎస్ వ్యూహాలు రూపొందించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ లెవల్లో ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. ఆర్ఎస్ఎస్ గ్రూపులు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్ని నేరుగా కలుస్తున్నాయి. ఒక్కో టీము 5-10 మంది వ్యక్తులతో కూడిన చిన్న సమూహాలతో సమావేశమై, వారి కుటుంబాలతో మాట్లాడుతోంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..