Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో అధికారం బీజేపీ కూటమిదే.. ఆర్ఎస్ఎస్ సర్వేలో వెల్లడి..
- మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి..
- మరోసారి బీజేపీ కూటమిదే అధికారం..
- ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వేలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Assembly Elections: దేశం మొత్తం మహారాష్ట్ర్ర అసెంబ్లీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, జమ్మూ కాశ్మీర్లో ఫలితాల తర్వాత మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతాయా..? అని అంతా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలో రెండు కూటములు- బీజేపీ నేతృత్వంని ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(షిండే)ల ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ(శరద్ పవార్), ఉద్ధవ్ ఠాక్రే శివసేనల ‘మహా వికాస్ అఘాడీ’ కూటముల మధ్య పోరు నెలకొంది. నవంబర్ 20న రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇరు కూటముల్లో పొత్తులు కొలిక్కి వచ్చాయి.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఇదిలా ఉంటే.. బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నిర్వహించిన అంతర్గత సర్వేలో బీజేపీ కూటమి మహాయుతి మళ్లీ అధికారం సాధిస్తుందని తేలింది. అక్టోబర్ తొలినాళ్లలో ఆర్ఎస్ఎస్ ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. 288 సీట్లలో మహాయుతికి 160కి పైగా సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. బీజేపీకి 90 నుంచి 95, శివసేన(షిండే) పార్టీకి 40-50 సీట్లు, ఎన్సీపీ(అజిత్ పవార్)కి 25-30 సీట్లు వస్తాయని చెప్పింది. ఈ అంచనాలు నిజమైతే మళ్లీ బీజేపీ మహారాష్ట్రలో అధికారం చేపట్టనుంది.
మరోవైపు హర్యానా ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ గెలుపుకు కీలకంగా వ్యవహరించింది. క్షేత్రస్థాయిలో స్వయంసేవకులు పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా అదే మ్యాజిక్ చేసేలా ఆర్ఎస్ఎస్ వ్యూహాలు రూపొందించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ లెవల్లో ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. ఆర్ఎస్ఎస్ గ్రూపులు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్ని నేరుగా కలుస్తున్నాయి. ఒక్కో టీము 5-10 మంది వ్యక్తులతో కూడిన చిన్న సమూహాలతో సమావేశమై, వారి కుటుంబాలతో మాట్లాడుతోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!