Maha Kumbha Mela: కుంభమేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- మహా కుంభ మేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- వెళ్లి రావడానికి టికెట్ ధరలు రూ. 50000 కన్నా పైమాటే..
- చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన డీజీసీఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbha Mela: హిందువులు ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభ మేళా’’కి వెళ్లే భక్తులను విమానయాన సంస్థలు దోచుకుంటున్నాయి. హిందువులు ఒక్కసారైన కుంభమేళకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎయిర్లైనర్లు ఉపయోగించుకుంటున్నాయి. ప్రయాగ్రాజ్తో పాటు కుంభమేళకు సమీపంలో ఉన్న వారణాసి, లక్నో, అయోధ్యలకు టికెట్ ధరల్ని అమాంతంగా పెంచాయి. సామాన్యుడు ఈ టికెట్ల ధరల్ని చూసి, విమానం ఎక్కే పరిస్థితి లేదు. ఈ టికెట్ల రేట్ల కన్నా బ్యాంకాక్, మాల్దీవుల వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వచ్చేందుకు టికెట్ రేట్లు చాలా తక్కువ ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి కుంభమేళాకు వెళ్లాలంటే ఒక్కోక్కరు సుమారుగా రూ. 30000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రానుపోనూ ఖర్చులు ఒకరికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంటున్నాయి. మహాకుంభమేళలో కీలక పుణ్య స్నానాల రోజులైన మౌని అమావాస్య స్నాన్ (జనవరి 29), బసంత్ పంచమి (ఫిబ్రవరి 3), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 12), మరియు మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) వంటి రోజుల్లో టికెట్ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Sangareddy: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన భార్య..
విమానయాన సంస్థలు టికెట్ రేట్లను పెంచడంపై డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. మహా కుంభ మేళ సమయంలో ప్రయాగ్ రాజ్కి విమాన ఛార్జీలను హేతుబద్ధీకరించాలని కోరింది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ప్రయాగ్రాజ్ ఎయిర్ కనెక్టివిటీ 132 విమానాలకు పెంచింది.
భక్తుల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భద్రత, సౌకర్యాలను, అనేక సంస్థలు దాతృత్వ సేవల్ని నిస్వార్థంగా చేస్తుంటే, విమానయాన సంస్థలు మాత్రం ప్రయాణికులను నిలువుదోపిడి చేస్తున్నాయని వీహెచ్పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ విమర్శించారు.
హైదరాబాద్-ప్రయాగ్ రాజ్ రూట్లో టికెట్ ధర సుమారుగా రూ. 27 వేలు- రూ. 31 వేలుగా ఉంది. చెన్నై నుంచి ప్రయాగ్ రాజ్కి ఒక్క ఫ్లైట్ టికెట్ ధర సుమారుగా రూ. 21 వేలు-రూ. 32 వేలుగా ఉంది. బెంగళూర్ నుంచి కూడా ఇదే తరహా రేట్లు ఉన్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో ఒక్కో టికెట్ కేవలం రూ. 6000- రూ.8000 మధ్యలో ఉంటుంది. ఢిల్లీ నుంచి ఈ ధరలు రూ. 15 వేలు- రూ. 22 వేల మధ్యలో ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఇది కేవలం రూ. 5000 ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!