Maha Kumbha Mela: కుంభమేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- మహా కుంభ మేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- వెళ్లి రావడానికి టికెట్ ధరలు రూ. 50000 కన్నా పైమాటే..
- చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన డీజీసీఏ..
Maha Kumbha Mela: హిందువులు ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభ మేళా’’కి వెళ్లే భక్తులను విమానయాన సంస్థలు దోచుకుంటున్నాయి. హిందువులు ఒక్కసారైన కుంభమేళకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎయిర్లైనర్లు ఉపయోగించుకుంటున్నాయి. ప్రయాగ్రాజ్తో పాటు కుంభమేళకు సమీపంలో ఉన్న వారణాసి, లక్నో, అయోధ్యలకు టికెట్ ధరల్ని అమాంతంగా పెంచాయి. సామాన్యుడు ఈ టికెట్ల ధరల్ని చూసి, విమానం ఎక్కే పరిస్థితి లేదు. ఈ టికెట్ల రేట్ల కన్నా బ్యాంకాక్, మాల్దీవుల వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వచ్చేందుకు టికెట్ రేట్లు చాలా తక్కువ ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి కుంభమేళాకు వెళ్లాలంటే ఒక్కోక్కరు సుమారుగా రూ. 30000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రానుపోనూ ఖర్చులు ఒకరికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంటున్నాయి. మహాకుంభమేళలో కీలక పుణ్య స్నానాల రోజులైన మౌని అమావాస్య స్నాన్ (జనవరి 29), బసంత్ పంచమి (ఫిబ్రవరి 3), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 12), మరియు మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) వంటి రోజుల్లో టికెట్ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
Read Also: Sangareddy: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన భార్య..
విమానయాన సంస్థలు టికెట్ రేట్లను పెంచడంపై డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. మహా కుంభ మేళ సమయంలో ప్రయాగ్ రాజ్కి విమాన ఛార్జీలను హేతుబద్ధీకరించాలని కోరింది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ప్రయాగ్రాజ్ ఎయిర్ కనెక్టివిటీ 132 విమానాలకు పెంచింది.
భక్తుల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భద్రత, సౌకర్యాలను, అనేక సంస్థలు దాతృత్వ సేవల్ని నిస్వార్థంగా చేస్తుంటే, విమానయాన సంస్థలు మాత్రం ప్రయాణికులను నిలువుదోపిడి చేస్తున్నాయని వీహెచ్పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ విమర్శించారు.
హైదరాబాద్-ప్రయాగ్ రాజ్ రూట్లో టికెట్ ధర సుమారుగా రూ. 27 వేలు- రూ. 31 వేలుగా ఉంది. చెన్నై నుంచి ప్రయాగ్ రాజ్కి ఒక్క ఫ్లైట్ టికెట్ ధర సుమారుగా రూ. 21 వేలు-రూ. 32 వేలుగా ఉంది. బెంగళూర్ నుంచి కూడా ఇదే తరహా రేట్లు ఉన్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో ఒక్కో టికెట్ కేవలం రూ. 6000- రూ.8000 మధ్యలో ఉంటుంది. ఢిల్లీ నుంచి ఈ ధరలు రూ. 15 వేలు- రూ. 22 వేల మధ్యలో ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఇది కేవలం రూ. 5000 ఉంటుంది.
తాజావార్తలు
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!