Kallakuruchi Case: కళ్లకురిచి కేసు రేప్, మర్డర్ కాదు.. కేవలం సూసైడ్ మాత్రమే: మద్రాస్ హైకోర్టు
Madras High Court on Kallakurichi student death: తమిళనాడు రాష్ట్రంలో పాటు యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారిన కళ్లకురిచి కేసులో మద్రాస్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును తప్పుదారి పట్టించడాన్ని మద్రాస్ హైకోర్ట్ తోసిపుచ్చింది. 17 ఏళ్ల విద్యార్థిని మరణం కేవలం ఆత్మహత్యేనని.. హత్య, అత్యాచారం కాదని స్పష్టం చేసింది. తమిళనాడు కళ్లకురిచిలో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. విద్యార్థులు పెద్ద నిరసనలు చేపట్టి ఆందోళనలు నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తడితోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.
బాలిక మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టాన్ని నిర్వహించారు. పుదుచ్చేరి జిప్మర్కు చెందిన ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం నివేదిక ఆధారంగా జస్టిస్ జికె ఇళంతిరైయన్ ఈ వ్యాఖ్యాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాథమికంగా బాలిక మరణం ఆత్మహత్యే అని తెలుస్తోందని.. హత్య, అత్యాచారం కాదని అన్నారు. బాలిక శరీరంపై అయిన గాయాలు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకడంతో అయినవే అని నిర్థారించారు.
Also Read
Read Also: Manish Sisodia: నా బ్యాంకు లాకర్లలో సీబీఐకి ఏం దొరకలేదు.. అయినా నన్ను అరెస్ట్ చేస్తారు.
అత్యాచారం, హత్య కింద ఎలాంటి ఆధారాలు లభించలేదని.. మరణించిన విద్యార్థిని సూసైడ్ నోట్ పరిశీలించినా.. కెమిస్ట్రీ సబ్జెక్టులో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మూడో అంతస్తు మెట్ల వద్ద రక్తంగా అనుమానించిన ఎరుపురంగు గుర్తులు రక్తం కాదని వెల్లడించింది. ఈ కేసులో గతం వారం పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, నిర్వాహకులు ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది.
సేలం జిల్లా కళ్లకురుచ్చిలోని ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని జూలై 13న హస్టల్ ఆవరణలో శవమై కనిపించింది. ఉపాధ్యాయుల వేధింపులు తాళలేకే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆమె తల్లిదండ్రలు ఆరోపించారు. దీంతో జూలై 17న పాఠశాలలో తీవ్రంగా హింస చెలరేగింది. బస్సులను కాల్చేశారు ఆందోళనకారులు. అయితే ఈ కేసులో ఏ తప్పు చేయని వారిని 45 రోజులకు పైగా జైలో ఉంచడం దురదృష్టకమరని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసులో ఆందోళనలకు పాల్పడ్డ వారిని పోలీసులు గుర్తించారు. ఇందులో మైనర్లతో పాటు 53 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ కేసి రిమాండ్ కు తరలించారు. సెప్టెంబర్ 27కు ఈ కేసును వాయిదా వేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో