Kallakuruchi Case: కళ్లకురిచి కేసు రేప్, మర్డర్ కాదు.. కేవలం సూసైడ్ మాత్రమే: మద్రాస్ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court on Kallakurichi student death: తమిళనాడు రాష్ట్రంలో పాటు యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారిన కళ్లకురిచి కేసులో మద్రాస్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును తప్పుదారి పట్టించడాన్ని మద్రాస్ హైకోర్ట్ తోసిపుచ్చింది. 17 ఏళ్ల విద్యార్థిని మరణం కేవలం ఆత్మహత్యేనని.. హత్య, అత్యాచారం కాదని స్పష్టం చేసింది. తమిళనాడు కళ్లకురిచిలో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. విద్యార్థులు పెద్ద నిరసనలు చేపట్టి ఆందోళనలు నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తడితోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.
బాలిక మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టాన్ని నిర్వహించారు. పుదుచ్చేరి జిప్మర్కు చెందిన ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం నివేదిక ఆధారంగా జస్టిస్ జికె ఇళంతిరైయన్ ఈ వ్యాఖ్యాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాథమికంగా బాలిక మరణం ఆత్మహత్యే అని తెలుస్తోందని.. హత్య, అత్యాచారం కాదని అన్నారు. బాలిక శరీరంపై అయిన గాయాలు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకడంతో అయినవే అని నిర్థారించారు.
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: Manish Sisodia: నా బ్యాంకు లాకర్లలో సీబీఐకి ఏం దొరకలేదు.. అయినా నన్ను అరెస్ట్ చేస్తారు.
అత్యాచారం, హత్య కింద ఎలాంటి ఆధారాలు లభించలేదని.. మరణించిన విద్యార్థిని సూసైడ్ నోట్ పరిశీలించినా.. కెమిస్ట్రీ సబ్జెక్టులో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మూడో అంతస్తు మెట్ల వద్ద రక్తంగా అనుమానించిన ఎరుపురంగు గుర్తులు రక్తం కాదని వెల్లడించింది. ఈ కేసులో గతం వారం పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, నిర్వాహకులు ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది.
సేలం జిల్లా కళ్లకురుచ్చిలోని ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని జూలై 13న హస్టల్ ఆవరణలో శవమై కనిపించింది. ఉపాధ్యాయుల వేధింపులు తాళలేకే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆమె తల్లిదండ్రలు ఆరోపించారు. దీంతో జూలై 17న పాఠశాలలో తీవ్రంగా హింస చెలరేగింది. బస్సులను కాల్చేశారు ఆందోళనకారులు. అయితే ఈ కేసులో ఏ తప్పు చేయని వారిని 45 రోజులకు పైగా జైలో ఉంచడం దురదృష్టకమరని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసులో ఆందోళనలకు పాల్పడ్డ వారిని పోలీసులు గుర్తించారు. ఇందులో మైనర్లతో పాటు 53 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ కేసి రిమాండ్ కు తరలించారు. సెప్టెంబర్ 27కు ఈ కేసును వాయిదా వేశారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!