Manish Sisodia: నా బ్యాంకు లాకర్లలో సీబీఐకి ఏం దొరకలేదు.. అయినా నన్ను అరెస్ట్ చేస్తారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI searched Delhi Deputy CM’s bank lockers: ఢిల్లీ మద్యం స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన లాకర్లను మంగళవారం పరిశీలించారు సీబీఐ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లోని ఘజియాబాద్ సెక్టార్ 4లో ఉన్న పీఎన్బీ బ్యాంచ్ లో ఐదుగురు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలపై మనీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ అధికారుల దాడుల్లో ఏమీ దొరకలేదని ఆయన అన్నారు. గతంలో నా నివాసంలో సోదాలు చేసినప్పుడు ఏం దొరకలేదని.. ప్రస్తుతం నా బ్యాంకు లాకర్లలో కూడా ఏం దొరకలేదని.. నాకు క్లీన్ చిట్ లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. సీబీఐ అధికారులు మమ్మల్ని బాగా ఆదరించారని.. మేము కూడా విచారణకు సహకరించామని.. నిజం గెలిచిందంటూ.. ఆయన వ్యాఖ్యానించారు.
జన్మాష్టమి రోజున నా ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారని.. ఆగస్టు 19న సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకుందని.. ఈ రోజు లాకర్లు తెరిచినా.. ఏమీ కనిపించలేదని మనీష్ సిసోడియా అన్నారు. నాభార్యకు సంబంధించిన రూ. 80,000 ఆభరణాలు మాత్రమే ఉన్నాయని సిసోడియా వెల్లడించారు.ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకే సీబీఐ అదికారులు దాడులు చేశారని మనీస్ సిసోడియా ఆరోపించారు. అయినా వారు నన్ను జైలుకు పంపేందుకు చూస్తున్నారని.. రెండు మూడు నెలల నన్ను జైలులో వేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆరోపించారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Team India: టీ20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు
ఢిల్లీ మద్యం స్కామ్ లో మనీష్ సిసోడియాతో పాటు మరో 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. అయితే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏ1గా ఉన్నారు. ఆగస్టు 19న దేశవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. సిసోడియా నివాసంతో పాటు ఈ స్కామ్ లో పాలుపంచుకున్నట్లు ఆరోపించబడుతున్న పలువరు వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేశారు. అయితే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పార్టీని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అడ్డుకునేందుకే సీబీఐతో కేంద్రం దాడులు చేయిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!