Manish Sisodia: నా బ్యాంకు లాకర్లలో సీబీఐకి ఏం దొరకలేదు.. అయినా నన్ను అరెస్ట్ చేస్తారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI searched Delhi Deputy CM’s bank lockers: ఢిల్లీ మద్యం స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన లాకర్లను మంగళవారం పరిశీలించారు సీబీఐ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లోని ఘజియాబాద్ సెక్టార్ 4లో ఉన్న పీఎన్బీ బ్యాంచ్ లో ఐదుగురు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలపై మనీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ అధికారుల దాడుల్లో ఏమీ దొరకలేదని ఆయన అన్నారు. గతంలో నా నివాసంలో సోదాలు చేసినప్పుడు ఏం దొరకలేదని.. ప్రస్తుతం నా బ్యాంకు లాకర్లలో కూడా ఏం దొరకలేదని.. నాకు క్లీన్ చిట్ లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. సీబీఐ అధికారులు మమ్మల్ని బాగా ఆదరించారని.. మేము కూడా విచారణకు సహకరించామని.. నిజం గెలిచిందంటూ.. ఆయన వ్యాఖ్యానించారు.
జన్మాష్టమి రోజున నా ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారని.. ఆగస్టు 19న సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకుందని.. ఈ రోజు లాకర్లు తెరిచినా.. ఏమీ కనిపించలేదని మనీష్ సిసోడియా అన్నారు. నాభార్యకు సంబంధించిన రూ. 80,000 ఆభరణాలు మాత్రమే ఉన్నాయని సిసోడియా వెల్లడించారు.ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకే సీబీఐ అదికారులు దాడులు చేశారని మనీస్ సిసోడియా ఆరోపించారు. అయినా వారు నన్ను జైలుకు పంపేందుకు చూస్తున్నారని.. రెండు మూడు నెలల నన్ను జైలులో వేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆరోపించారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: Team India: టీ20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు
ఢిల్లీ మద్యం స్కామ్ లో మనీష్ సిసోడియాతో పాటు మరో 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. అయితే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏ1గా ఉన్నారు. ఆగస్టు 19న దేశవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. సిసోడియా నివాసంతో పాటు ఈ స్కామ్ లో పాలుపంచుకున్నట్లు ఆరోపించబడుతున్న పలువరు వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేశారు. అయితే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పార్టీని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అడ్డుకునేందుకే సీబీఐతో కేంద్రం దాడులు చేయిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?