Madras High Court: తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగింపుపై సంచలన తీర్పు
- తిరుపరంకుండ్రం కొండ వివాదానికి ముగింపు
- దీపం వెలిగింపుపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
- స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగింపుపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయ దేవస్థానం తప్పనిసరిగా దీపం వెలిగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రజా సమూహం లేకుండా ఆచారాన్ని నియంత్రిత పద్ధతిలో నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకె రామకృష్ణన్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇది కూడా చదవండి: Silver Rates: సిల్వర్ మళ్లీ విశ్వరూపం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
తిరుపరంకుండ్రం కొండ తమిళనాడులోని మధురైకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతనమైన పవిత్రకొండ. కొండపై సుబ్రమణ్యస్వామి ఆలయం చెక్కబడింది. దీన్ని భారత ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించింది. అయితే ఈ కొండపై ఇతర మతపరమైన కట్టడాలు కూడా ఉన్నాయి. దర్గా (మసీదు), జైన అవశేషాలు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ మధ్య తీవ్రమయ్యాయి.
ఇది కూడా చదవండి: Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి
అయితే కొండపై దర్గా ఉన్న కారణాన హిందూ మతపరమైన ఆచారంలో భక్తులకు దీపం వెలిగించే హక్కు ఉందా? అనే అంశంపై మత సంస్థలు, తమిళనాడు ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందని స్టాలిన్ ప్రభుత్వం పేర్కొంది.
మంగళవారం విచారించిన ధర్మాసనం.. రిట్ అప్పీలుపై తీర్పును వెలువరిస్తూ.. కొండపై దీపం వెలిగించడానికి ఆలయ దేవస్థానానికి అనుమతి ఇచ్చింది. నిర్వహించే హక్కు ఉందని తీర్పునిచ్చింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ పేర్కొంది. కోర్టు ఆదేశాలను పాటించేలా.. ఆచార నిర్వహణ సమయంలో క్రమశిక్షణను కాపాడటానికి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. మొత్తానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ధర్మాసనం ముగింపు పలికింది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..